iDreamPost
android-app
ios-app

బీహార్ లో మరో నిర్భయ ఘటన.. కదులుతున్న బస్సులో బాలికపై గ్యాంగ్ రేప్

  • Published Jun 09, 2022 | 9:05 AM Updated Updated Jun 09, 2022 | 9:05 AM
  • Published Jun 09, 2022 | 9:05 AMUpdated Jun 09, 2022 | 9:05 AM
బీహార్ లో మరో నిర్భయ ఘటన.. కదులుతున్న బస్సులో బాలికపై గ్యాంగ్ రేప్

బీహార్ లో మరో నిర్భయ తరహా ఘటన జరిగింది. చంపారన్ జిల్లాలో జరిగిందీ దారుణ ఘటన. కదులుతోన్న బస్సులో బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు దుర్మార్గులు. ఈస్ట్ చంపారన్ జిల్లాలోని మోతిహరి బస్టాండ్లో 17 ఏళ్ల బాలిక బెట్టయ్య ప్రాంతానికి వెళ్లే బస్సు కోసం ఎదురుచూస్తూ ఉంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఓ బస్ డ్రైవర్ ఎక్కడికి వెళ్లాలని అడగ్గా.. బెట్టయ్యకు వెళ్లాలని చెప్పింది. తాను నడిపే బస్సు కూడా అటే వెళ్తోందని, బస్సు ఎక్కితే ఊర్లో దింపేస్తానని నమ్మించాడు.

డ్రైవర్ మాటలు నమ్మిన బాలిక బస్సెక్కింది. అప్పటికే బస్సులో ఉన్న కొందరు వ్యక్తులు ఆమెకు మత్తుమందు కలిపిన పానీయాన్ని ఇచ్చారు. కొద్దిసేపటికి బాలిక స్పృహ కోల్పోవడంతో బస్సులో ఉన్న నలుగురు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బస్సును రోడ్డు పక్కన ఆపి.. బాలికను బస్సులోనే వదిలేసి డోర్లు వేసి నిందితులు పరారయ్యారు.

స్పృహలోకి వచ్చాక డోర్లు వేసి ఉండటంతో.. బాలిక అటుగా వెళ్తున్న వారిని సహాయం అడగ్గా వారు డోర్లు తెరిచారు. తనపై అత్యాచారం జరిగిందని గ్రహించిన బాలిక.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. బాలికకు ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. బస్సును సీజ్ చేసి, ఫోరెన్సిక్ బృందం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో బస్సు డ్రైవర్, కండక్టర్, హెల్పర్ తో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio