iDreamPost
android-app
ios-app

భార్య ప్రతిరోజు అందంగా తయారై బయటకు వెళ్తుందని.. భర్త ఏం చేశాడంటే?

  • Published Aug 15, 2024 | 11:44 AM Updated Updated Aug 15, 2024 | 11:44 AM

సాధరణంగా ఏ భర్త అయినా తన భార్య అందంగా ఉండాలని, బయటకు అందంగా కనిపించలని కోరుకుంటాడు. కానీ, తాజాగా ఓ భర్త మాత్రం తన భార్య అందంగా తయారై బయటకు వెళ్తుండం చూసి ఓర్వాలేక ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు.

సాధరణంగా ఏ భర్త అయినా తన భార్య అందంగా ఉండాలని, బయటకు అందంగా కనిపించలని కోరుకుంటాడు. కానీ, తాజాగా ఓ భర్త మాత్రం తన భార్య అందంగా తయారై బయటకు వెళ్తుండం చూసి ఓర్వాలేక ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు.

  • Published Aug 15, 2024 | 11:44 AMUpdated Aug 15, 2024 | 11:44 AM
భార్య ప్రతిరోజు అందంగా తయారై బయటకు వెళ్తుందని.. భర్త ఏం చేశాడంటే?

ఏ వైవాహిక బంధంలోనైనా ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, బాధ్యత అంతకు మించి నమ్మకం ఉండాలి. అంతేకాని లేనిపోని అనుమానాలు, ఈగోలు అనేవి దాంపత్య జీవితంలో ప్రవేశించకూడదు. కానీ, నేటి కాలంలో అన్యోన్యంగా ఉండాల్సిన దాంపత్య జీవితాలు.. అడ్డదారులు తొక్కుతున్నాయి. ముఖ్యంగా అనుమానం, అక్రమ సంబంధం వంటి ముసుగులో ఘర్షణలకు దిగడం, హత్యలు చేసుకోవడం వంటి ఘటనుల ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే.. తాజాగా జరిగిన ఓ ఘటనలో భార్యగా అందంగా తయారై బయటకు వెళ్లిందని ఓర్వలేని  ఓ భర్త చేసిపని స్థానికంగా సంచలనం సృష్టించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

సాధరణంగా ఏ భర్త అయినా తన భార్య అందంగా ఉండాలని, బయటకు అందంగా కనిపించలని కోరుకుంటాడు. కానీ, తాజాగా ఓ భర్త మాత్రం తన భార్య అందంగా తయారై బయటకు వెళ్తుండం చూసి ఓర్వాలేకపోయాడు. ఈ క్రమంలోనే పలుమార్లు ఆమెతో గొడవ పడేవాడు. ఇక అంతటితో ఆగని ఆ భర్త చివరికి నమ్మించి బయటకు తీసుకెళ్లి మరి, ఊహించని దారుణానికి ఒడిగట్టాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కర్ణాటకలో రామనగర జిల్లా మాగడికి చెందిన దివ్య (32), ఉమేశ్‌ అనే భార్య భర్తలు ఉన్నారు. అయితే ఉమేష్ భార్య దివ్య అందంగా కనపడాలనే తపనతో ఎప్పుడూ లిప్‌స్టిక్‌ వేసుకునేది. పైగా ఓ టాటూ కూడా వేయించుకుంది. కానీ, భార్య అందంగా తయారైందేకు చేస్తున్న పనులు ఉమేశ్ కు నచ్చేవి కాదు. దీంతో రోజు ఆమెతో గొడవపడేవాడు.

ఈ నేపథ్యంలోనే..  భర్త అనుమానాలు, వేధింపులు తట్టుకోలేక కొన్ని రోజుల క్రితం మాగడి ఫ్యామిలీ కోర్టులో దివ్య విడాకుల పిటిషన్‌ వేశారు. దీంతో మంగళవారం ఇద్దరూ విచారణకు హాజరుకాగా ఇకపై అనుమానించనని దివ్యను ఉమేశ్‌ నమ్మించాడు. ఇక భర్త మారాడనుకుని అతడితో కలిసి దివ్య స్థానిక ఊజగల్లు దేవాలయానికి వెళ్లింది. అయితే దివ్యను ముందే  హత్య చేయాలని ముందే నిశ్చయించుకున్న ఉమేశ్‌ పథకం ప్రకారం.. దర్శనం అనంతరం గుడి దగ్గర ఉన్న  కొండ వద్దకు దివ్యను తీసుకెళ్లి తన నలుగురు స్నేహితులతో కలిసి కడతేర్చాడు. అనంతరం మృతదేహాన్ని చీలూరు అటవీ ప్రాంతంలో పడేశారు. అయితే ఈ  ఘటన గురించి సమాచారం  తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం మృతురాలి భర్త ఉమేశ్ తో పాటు  ముగ్గురు నిందితులు పట్టుబడగా మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.