iDreamPost
android-app
ios-app

బైక్ నడుపుతున్నవారికి బిగ్ అలర్ట్..ఈ కొత్త ట్రాఫిక్ రూల్స్ తెలుసా?

  • Published Jul 29, 2024 | 9:28 PM Updated Updated Jul 29, 2024 | 9:28 PM

వాహనదారులు ఇప్పటి వరకు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం, అతి వేగంగా ప్రయాణించడం, ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడమే నేరం అనుకుంటే.. ఇప్పుడు కొత్తగా మరో కొత్త రూల్స్ అనేవి అధికారులు ప్రవేశ పెట్టారు. ఇక నుంచి బైక్ పై వెళ్తునప్పుడు దానిని నడిపే వ్యక్తి వెనుక కూర్చున్న వారితో మాట్లాడటం కూడా ట్రాఫిక్ నింబంధనలను ఉల్లంఘించడం కిందే వస్తుందని కొత్త రూల్స్ ను తీసుకువచ్చారు. ఎక్కడంటే..

వాహనదారులు ఇప్పటి వరకు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం, అతి వేగంగా ప్రయాణించడం, ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడమే నేరం అనుకుంటే.. ఇప్పుడు కొత్తగా మరో కొత్త రూల్స్ అనేవి అధికారులు ప్రవేశ పెట్టారు. ఇక నుంచి బైక్ పై వెళ్తునప్పుడు దానిని నడిపే వ్యక్తి వెనుక కూర్చున్న వారితో మాట్లాడటం కూడా ట్రాఫిక్ నింబంధనలను ఉల్లంఘించడం కిందే వస్తుందని కొత్త రూల్స్ ను తీసుకువచ్చారు. ఎక్కడంటే..

  • Published Jul 29, 2024 | 9:28 PMUpdated Jul 29, 2024 | 9:28 PM
బైక్ నడుపుతున్నవారికి బిగ్ అలర్ట్..ఈ కొత్త ట్రాఫిక్ రూల్స్ తెలుసా?

ఈ మధ్య వాహనదారులకు ట్రాఫిక్ సమస్యలతో పాటు ట్రాఫిక్ రూల్స్ కూడా ఎక్కువగా పెరిగిపోయాయి. అయితే ఇది వాహనదారుల భద్రత గురించి ఆలోచించి తీసుకుంటున్న నిర్ణయాలే కావచ్చు. కానీ, వాహనదారులకు మాత్రం ఈ రూల్స్ తో అడుగు తీసి బయటకు వెళ్లలంటే చాలా భయపడుతున్నారు. ఇకపోతే ఈ ట్రాఫిక్ రూల్స్ ను కొంతమంది పాటిస్తూ ముందకు వెళ్తే.. మరి కొందరు మాత్రం పూర్తిగా ఈ రూల్స్ ను బ్రేక్ చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహారిస్తారు. దీంతో కోరి ప్రమాదాలను తెచ్చిపెట్టుకుంటారు. అయితే రోజు రోజుకి ఈ ప్రమాదాలు తారస్థాయికి చేరుతుండటంతో.. అధికారులు కూడా ఈ ట్రాఫిక్ నిబంధనలు మరీంత కఠినం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రోజుకొక ట్రాఫిక్ రూల్స్ ను ప్రకటిస్తూ.. వాహనదారులకు అలర్ట్ ఇస్తున్నారు. తాజాగా మరోసారి వాహనదారులకు కొత్త ట్రాఫిక్ రూల్ ను అధికారులు ప్రవేశపెట్టారు. ఇంతకి అదేమిటంటే..

వాహనదారులు ఇప్పటి వరకు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం, అతి వేగంగా ప్రయాణించడం, ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడమే నేరం అనుకుంటే.. ఇప్పుడు కొత్తగా మరో కొత్త రూల్స్ అనేవి అధికారులు ప్రవేశ పెట్టారు. ఇక నుంచి బైక్ పై వెళ్తునప్పుడు దానిని నడిపే వ్యక్తి వెనుక కూర్చున్న వారితో మాట్లాడటం కూడా ట్రాఫిక్ నింబంధనలను ఉల్లంఘించడం కిందే వస్తుందని కొత్త రూల్స్ ను తీసుకువచ్చారు. ఈ రూల్స్ విని కంగారు పడిపోకండి. ఎందుకంటే.. ఈ రూల్స్ ప్రవేశ పెట్టింది మన తెలుగు రాష్ట్రాల్లో కాదు.. కేరళ రాష్ట్రంలో కేరళ రాష్ట్ర మోటారు వాహనాల శాఖ ఎంవీడీ ఈ కొత్త రూల్‌ను ప్రవేశపెట్టింది. ఇక నుంచి ఆ రాష్ట్రంలో బైక్ నడిపే వ్యక్తి వెనుక కూర్చున్న వారితో మాట్లాడితే శిక్షార్హమైన నేరం అని కేరళ సర్కార్ తాజాగా విధించింది. ఇక ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాలని కేరళ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్టీఏ కార్యాలయాలకు ఆదేశాలు ఇచ్చింది.

అయితే వాహనం నడిపే వారు ఇలా వెనుక కూర్చున్న వారితో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడంతో.. ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆ రాష్ట్ర రవాణా శాఖ అధికారులు గుర్తించారు. ఇక ఇది గుర్తించిన తర్వాత ఈ నిబంధనను తీసుకున్నట్లు జాయింట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ కే మనోజ్‌ కుమార్‌ వెల్లడించారు. కనుక ఈ కొత్త రూల్స్ ను ఉల్లఘించినట్లయితే భారీ జరిమానాతో పాటు కఠిన చర్యలు తీసుకుంటమని తెలిపారు. కానీ, జరిమానా ఎంత అనేది ఇంక నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. మరీ, కేరళ రాష్ట్రంలో వాహనదారులకు తీసుకువచ్చిన ఈ కొత్త రూల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomMarsbahis girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/