iDreamPost
android-app
ios-app

జూలై నుండి మహిళల ఖాతాల్లో నెలకి రూ.8,500! ఈ హామీ ఎవరికి అంటే?

  • Published May 17, 2024 | 1:20 PM Updated Updated May 17, 2024 | 1:26 PM

జూలై నుంచి మహిళల ఖాతాలో 8500 రూపాయలు జమ చేస్తారంట. మరి ఇంత భారీ మొత్తం ఎందుకు.. ఎవరికి అంటే..

జూలై నుంచి మహిళల ఖాతాలో 8500 రూపాయలు జమ చేస్తారంట. మరి ఇంత భారీ మొత్తం ఎందుకు.. ఎవరికి అంటే..

  • Published May 17, 2024 | 1:20 PMUpdated May 17, 2024 | 1:26 PM
జూలై నుండి మహిళల ఖాతాల్లో నెలకి రూ.8,500! ఈ హామీ ఎవరికి అంటే?

దేశంలో నగదు బదిలీ పథకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. స్కీమ్ ల కింద.. ఇతరాత్ర సాయం చేసే కన్నా.. లబ్ధిదారుల చేతికి నగదు ఇస్తేనే మంచిది అని భావిస్తున్న ప్రభుత్వాలు.. ఆ దిశగా పథకాలను తీసుకొస్తున్నాయి. దీని వల్ల మార్కెట్లో నగదు ప్రవాహం పెరగడమే కాక.. కొనుగోలు శక్తి కూడా పెరుగుతుందని అంటున్నారు. ఈ ఎన్నికల వేళ దాదాపు అన్ని పార్టీల నగదు బదిలీ పథకాలకు సంబంధించి హామీలు ఇస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రతి నెల మహిళల ఖాతాలో 2,500 రూపాయలు వేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో హామీ తెర మీదకు వచ్చింది. జూలై నుంచి ప్రతి మహిళ ఖాతాలో 8,500 రూపాయలు జమ చేస్తామంటున్నారు. ఆ వివరాలు..

దేశంలో ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నాలుగు దశల్లో పోలింగ్ ముగిసింది. ఇక జూన్ 4 ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం అన్ని పార్టీలు ఓటర్ల మీద హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ కీలక హామీ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలో సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పడితే.. ఇండియా కూటమి మహిళా సాధికారిత కోసం పాటు పడుతుందని తెలిపారు. దీనిలో భాగంగా జూలై నుంచి ప్రతి మహిళ ఖాతాలో 8,500 రూపాయలు ఖాతాలో పడనున్నాయి.

ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న మా సోదరీమణులు భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. జూన్ లో ఇండియా కూటమి ప్రభుత్వ ఏర్పడిన తర్వాత.. జూలై నుంచి ప్రతి నెలా మహిళల ఖాతాల్లో రూ.8,500 జమ అవుతుందని.. అంటే ఏడాదికి ప్రతి మహిళ ఖాతాలో లక్ష రూపాయల కన్నా ఎక్కు మొత్తం జమ చేస్తామని.. దీనివల్ల ప్రతి కుటుంబం ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయని తెలిపారు. అంతేకాక ఆశా, అంగన్‌వాడీ, కిచెన్‌ హెల్పర్‌ల గౌరవ వేతనానికి సంబంధించి కూడా కేంద్రం సహకారం రెట్టింపు కానుంది అన్నారు. రూ. 25 లక్షల బీమా పథకం మిమ్మల్ని వైద్య ఖర్చుల బారి నుంచి తప్పిస్తుంది అని ప్రియాకం గాంధీ హామీ ఇచ్చారు

అంతకుముందు బుధవారం, తన సోదరుడు, కాంగ్రెస్ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ కోసం ప్రచారం చేస్తున్న వేళ.. బీజేపీపై విమర్శల వర్షం కురిపించింది ప్రియాంక గాంధీ. ఎన్డీఏ ప్రభుత్వంలో ద్రవ్యోల్భణం భారీగా పెరిగిందని.. ఇల్లు గడవడం చాలా కష్టంగా మారిందని విమర్శించింది. గతంలో రూ.400కి లభించే సిలిండర్ ఇప్పుడు రూ.1200కి.. నూనె, పప్పులు, పిండి, చక్కెర, ధరలు భారీగా పెరిగి సామాన్యుల జీవితాలను దుర్భరం చేశాయని విమర్శించింది.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/