iDreamPost
android-app
ios-app

UGC NET 2024 వివాదంలో సంచలన నిజాలు! రూ.500కే క్వశ్చన్ పేపర్ లీక్!

  • Published Jun 21, 2024 | 11:51 AM Updated Updated Jun 21, 2024 | 11:51 AM

UGC NET 2024: యూజీసీ జాతీయ అర్హత పరీక్ష(నెట్)-2024 పరీక్ష వ్యవహరం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసింది. ఈ పరీక్షకు సంబంధించి..ప్రశ్నపత్రాలు లీకైనట్లు తేలింది. తాజాగా ఈ ఇష్యుపై కేంద్ర మంత్రి కీలక అంశాలను వెల్లడించారు.

UGC NET 2024: యూజీసీ జాతీయ అర్హత పరీక్ష(నెట్)-2024 పరీక్ష వ్యవహరం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసింది. ఈ పరీక్షకు సంబంధించి..ప్రశ్నపత్రాలు లీకైనట్లు తేలింది. తాజాగా ఈ ఇష్యుపై కేంద్ర మంత్రి కీలక అంశాలను వెల్లడించారు.

  • Published Jun 21, 2024 | 11:51 AMUpdated Jun 21, 2024 | 11:51 AM
UGC NET 2024 వివాదంలో సంచలన నిజాలు! రూ.500కే క్వశ్చన్ పేపర్ లీక్!

యూజీసీ నెట్-2024 పరీక్ష వ్యవహరం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసింది. ఈ పరీక్షకు సంబంధించి..ప్రశ్నపత్రాలు లీకైనట్లు తేలింది. దీంతో ఇటీవలే ఈ ఎగ్జామ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ ఇష్యూకు సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాక పరీక్ష ఇష్యూపై విపక్షాలు తీవ్ర స్థాయిలో నిరసనలు చేస్తున్నాయి. అంతేకాక తమకు న్యాయం జరగాలని పలువురు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యూజీసీ నెట్ రద్దుపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారి స్పందించారు. ఈ పరీక్షను రద్దు చేయడం అనేది ఆకస్మికనిర్ణయం కాదని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ ఇష్యూ గురించి కేంద్ర మంత్రి అనేక విషయాలను వెల్లడించారు.

యూజీసీ నెట్-2024 పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంగీకరించారు. అలానే ఈ పరీక్ష రద్దు చేయడం అనేది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయ కాదని తెలిపారు. ఇక ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం డార్క్ నెట్ లో లీక్ అయిందని ఆయన పేర్కొన్నారు. ఈనేపథ్యంలోనే మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ అయినా ‘టెలిగ్రామ్’ ద్వారా ఈ పేపర్ లు షేర్ అయిన్లటు తమకు ఆధారాలు లభించాయని ఆయన తెలిపారు. ప్రక్కా సమాచారం, ఫ్రూప్స్ ఉండటంతో నే యూజీసీ పరీక్షను రద్దు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే టెలిగ్రామ్, డార్క్‌నెట్  ద్వారా ఈ   క్వశ్చన్ పేపర్లను  రూ.500 నుంచి 5 వేల వరకు విక్రయించినట్లు తెలిసిందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే యూడీసీ నెట్ వ్యవహారంలో సీబీఐ కేసు నమోదు చేసిందన్నారు.

యూజీసీ, నెట్, నీట్ పరీక్షలకు సంబంధించిన ఇష్యూలపై కేంద్ర ప్రభుత్వం  విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ క్రమంలోనే నీట్ యూజీ-2024 పేపర్ లీకేజీకి సంబంధించి కేంద్ర మంత్రిత్వ శాఖ బీహార్ పోలీసులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు జరిపిన విచారణలో పలు ప్రాంతాల్లో అక్రమాలు జరిగినట్లు ఫ్రూప్ లు దొరికాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఇక ఈ ఘటనలో అవినీతికి పాల్పడిన, నిబంధనలు ఉల్లంఘనలకు పాల్పడిన వారందరినీ శిక్షిస్తామని అభ్యర్థులకు ఆయన హామీ ఇచ్చారు. ఈ అంశంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు,కీలక అంశాలను తెలుసుకుంటుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ కమిటితో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా పరిశీలిస్తుందని చెప్పారు. తమ ప్రభుత్వం విద్యార్థుల ప్రయోజనానికే తొలి ప్రాధాన్యతనిస్తుందని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. మరి.. కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss