iDreamPost
android-app
ios-app

BREAKING: ఘోర ప్రమాదం.. మిజోరంలో కూలిన బ్రిడ్జ్‌! 17 మంది మృతి

  • Published Aug 23, 2023 | 12:26 PMUpdated Aug 23, 2023 | 12:26 PM
  • Published Aug 23, 2023 | 12:26 PMUpdated Aug 23, 2023 | 12:26 PM
BREAKING: ఘోర ప్రమాదం.. మిజోరంలో కూలిన బ్రిడ్జ్‌! 17 మంది మృతి

మిజోరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సాయిరాంగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలిపోవడంతో అక్కడ పనిచేస్తున్న 17 మంది కార్మికులు మృతి చెందినట్లు సమాచారం. బుధవారం నిర్మాణ పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఐజ్వాల్‌కు 21 కిమీ దూరంలో ఉదయం 10 గంటలకు ఈ సంఘటన జరిగినప్పుడు 35 నుంచి 40 మంది కార్మికులు పనుల్లో నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తోంది.

శిథిలాల నుంచి ఇప్పటివరకు 17 మృతదేహాలను వెలికి తీసినట్లు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై ఇప్పటికే మిజోరం ప్రభుత్వంతో పాటు, కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి.. సహాయక చర్చలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సంబంధిత అధికారలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

ఇదీ చదవండి: సినిమా స్టైల్లో భార్య స్కెచ్.. భర్తను నమ్మించి తీసుకెళ్లి..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి