iDreamPost
android-app
ios-app

జాతీయ అవార్డులపై విశాల్ షాకింగ్ కామెంట్స్.. చెత్త బుట్టలో పడేస్తానంటూ..

  • Published Sep 03, 2023 | 10:59 AM Updated Updated Sep 03, 2023 | 10:59 AM
జాతీయ అవార్డులపై విశాల్ షాకింగ్ కామెంట్స్.. చెత్త బుట్టలో పడేస్తానంటూ..

సినిమా రంగంలో నటించే నటులు సినిమానే శ్వాసగా, సినిమానే లోకంగా జీవిస్తుంటారు. తాము నటించిన సినిమాలు ప్రేక్షకాదరణ పొంది విజయం సాదిస్తే ఎంతో సంతోషంతో ఉప్పొంగిపోతుంటారు. కెరీర్ లో మరిన్ని సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. ఇక వారు నటించిన సినిమాలకు అవార్డులు వస్తే మాత్రం చిత్ర యూనిట్ అంతా సంబరాల్లో మునిగిపోతారు. తాజాగా 69వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అవార్డుల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా తొలిసారిగా జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికై అల్లు అర్జున్ హిస్ట్రీ క్రియేట్ చేశాడు. అయితే తాజాగా ఈ అవార్డుల అంశంపై నటుడు విశాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

తెలుగు ప్రేక్షకులకు నటుడు విశాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన అద్భుతమైన నటనతో ఫ్యాన్స్ సంపాదించుకున్నాడు. కాగా తాను నటించిన చిత్రం మార్క్ ఆంటోని ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరో విశాల్, రీతూ వర్మ జంటగా నటిస్తున్నారు. అయితే సినిమా ప్రమోషన్లో భాగంగా చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న విశాల్ జాతీయ చలన చిత్ర అవార్డుల గురించి ఎవరూ ఊహించని వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా పరిశ్రమలో ఏదైనా సమస్య వస్తే స్పందించే విశాల్ ఇప్పుడు అవార్డులపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

అవార్డులపై తనకు ఎలాంటి ఆశ, నమ్మకం లేదని ఒక వేళ తను నటించిన చిత్రాలకు అవార్డులు వచ్చినా వాటిని చెత్తతో సమానంగా చూస్తానంటూ వెల్లడించారు. ప్రేక్షకులు, అభిమానుల ఆశీర్వాదంతో సినిమాలు చేస్తున్నానని వాస్తవానికి ఇదే నాకు అసలైన పెద్ద అవార్డు అని స్పష్టం చేశారు హీరో విశాల్. ఒకవేళ తాను నటించిన చిత్రాలకు అవార్డులు వచ్చినా వాటిని డస్ట్ బిన్ లో పడేస్తానంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఇక విశాల్ చేసిన ఈ వ్యాఖ్యలపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. విశాల్ అలా కామెంట్స్ చేయడానికి గల కారణాలేంటో అని చర్చించుకుంటున్నారు.

gamdomCasibomJojobet Girişmarsbahis girişJojobet GirişJojobet Güncel GirişMarsbahisJojobetHoliganbet