iDreamPost
android-app
ios-app

వయనాడ్ బాధితులకు చియాన్ విక్రమ్ భారీ విరాళం!

  • Published Aug 01, 2024 | 12:19 PM Updated Updated Aug 01, 2024 | 12:19 PM

Chiyaan Vikram: కేరళాలో ప్రకృతి విళయతాండవం చేస్తుంది. భారీ వర్షాల కారణంగా ప్రకృతిరమణీయమైన వయనాడ్ ఇప్పుడు స్మశాన దిబ్బగా మారింది. వయనాడ్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడి ఇప్పటి వరకు 300 మంది వరకు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.

Chiyaan Vikram: కేరళాలో ప్రకృతి విళయతాండవం చేస్తుంది. భారీ వర్షాల కారణంగా ప్రకృతిరమణీయమైన వయనాడ్ ఇప్పుడు స్మశాన దిబ్బగా మారింది. వయనాడ్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడి ఇప్పటి వరకు 300 మంది వరకు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.

  • Published Aug 01, 2024 | 12:19 PMUpdated Aug 01, 2024 | 12:19 PM
వయనాడ్ బాధితులకు చియాన్ విక్రమ్ భారీ విరాళం!

ప్రకృతి విపత్తు వచ్చినపుడు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు భారీ విరాళాలు ఇస్తూ తమ గొప్పతనాన్ని చాటుకుంటారు. కొంతమంది హీరోలు తెరపైనే కాదు.. తెర వెనుక కూడా గొప్ప పనులు చేస్తూ అభిమానుల మనసు దోచుకుంటారు. తమ అభిమానులు కష్టాల్లో ఉంటే వెంటనే వారికి సాయం అందిస్తుంటారు. ఆ మధ్య కేరళాలో భారీ వరదలు ముంచెత్తాయి..  లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఆ సమయంలో సౌత్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు ఇతర రంగాలకు చెందిన వారు భారీ విరాళాలు ఇచ్చి తమ గొప్ప మనసు చాటుకున్నారు.  తాజాగా వయనాడ్ బాధితుల కోసం చియాన్ విక్రమ్ గొప్ప మనసు చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే..

దేశంలో పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ వర్షాల కారణంగా జలమయం అయ్యాయి. కాల్వలు, చెవులకు గండ్లు పడి పలు గ్రామాలు నీట మునిగిపోయి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కేరళాలో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. ప్రకృతి రమణీయమైన వయనాడ్ జిల్లాలో కొండ చరియలు విరిగి పడి ఇప్పటి వరకు 250 కి పైగా మృత్యువాత పడ్డట్టు వార్తలు వస్తున్నాయి.ఎంతోమంది గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకా శిథిలాల కింద బాధితులు ప్రాణలతో పోరాడుతూనే ఉన్నాయి.రెస్క్యూ టీమ్ సహాయం కొనసాగుతూనే ఉంది. ప్రజలను కాపాడటానికి ప్రభుత్వం తమ వంతు కృషి చేస్తుంది. కేరళా పరిస్థితిపై సెలబ్రెటీలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.బాధితులను ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారు. తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తన వంతుగా భారీ విరాళం ఇచ్చారు.

Floods

ప్రముఖ హీరో చియాన్ విక్రమ్ వయనాడ్ బాధితులకు తనవంతు సాయంగా కేరళా గవర్నమెంట్ కి రూ.20 లక్షలు అందించారు. ఈ విషయం విక్రమ్ మేనేజర్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ‘కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లా‌లో కొండచరియలు విరిగి పడటం వల్ల పలువురు మరణించారు. ఎంతోమంది గాయపడ్డారు, మరికొంతమంది గల్లంతయ్యారు. ఈ విధ్వంసం చూసిన విక్రమ్ ఎంతో బాధపడ్డారు.. తనవంతు సాయంగా కేరళా సీఎం నిధికి రూ.20 లక్షల రూపాయల మొత్తాన్ని విరాళంగా అందించారు’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. తమ అభిమాన హీరో గొప్ప మనసుకు ఫ్యాన్స్ ఉప్పొంగి పోతున్నారు. పా రంజీత్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న ‘తంగలాన్’ మూవీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలకానుంది.