ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి

Producer Rambabu Passed away: ఈ మద్య సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత కన్నుమూయడంతో తీవ్ర విషాదం నెలకొంది.

Producer Rambabu Passed away: ఈ మద్య సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత కన్నుమూయడంతో తీవ్ర విషాదం నెలకొంది.

ఇటీవల సినీ పరిశ్రమలో ఒకరి తర్వాత ఒకరు కన్నుమూస్తున్నారు. నటీనటులు, దర్శక, నిర్మాతలతో పాటు ఇతర సాంకేతిక రంగాల్లో ప్రముఖులు వరుసగా కన్నుమూస్తున్నారు. హార్ట్ ఎటాక్, రోడ్డు ప్రమాదాలు, వయోభారం ఇలా కొన్ని అయితే.. కెరీర్ సరిగా లేక ఆర్థిక ఇబ్బందులతో కొంతమంది సెలబ్రెటీలు ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. ఏది ఏమైనా తాము అభిమానించే సెలబ్రెటీలు చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం దుఖఃసాగరంలో మునిగిపోతున్నారు. తాజాగా టాలీవుడ్ లో మరో విషాదం జరిగింది. ప్రముఖ నిర్మాత కన్నుమూశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త అయిన పొలిశెట్టి రాంబాబు (58) హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ చేర్పించారు కుటుంబ సభ్యులు. శనివారం ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించి తుదిశ్వాస విడిచారు. గోడమీద పిల్లి, లక్ష్మీ పుత్రుడు వంటి మూవీస్ కి రాంబాబు నిర్మాతగా వ్యవహరించారు. 2006 లో రిలీజ్ అయిన గోడమీద పిల్లి మూవీకి జనార్ధన మహర్షి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో జగపతి బాబు, అల్లరి నరేష్, ఆర్తి చాబ్రియా , గౌరీ ముంజాల్ ప్రధాన పాత్రలు పోషించగా కోటి సంగీతం సమకూర్చారు. కామెడీ జోనర్ లో వచ్చిన ఈ చిత్రం మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది.

2008 లో రాజ్ కపూర్ దర్శత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘లక్ష్మీ పుత్రుడు’. ఈ మూవీలో ఉదయ్ కిరణ్, దియా ప్రధాన పాత్రల్లో నటించారు. డి ఇమ్మాన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా కూడా పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. ఇండస్ట్రీలోకి రాక ముందు ఆయన సీపీఎం పార్టీ అనుబంధ సంఘమైన ప్రజానాట్య మండలిలో పనిచేశారు. పొలిశెట్టి రాంబాబు మరణవార్త తెలిసిన సినీ ప్రముఖులు, కమ్యూనిస్టు నాయకులు ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు.

Show comments