iDreamPost
android-app
ios-app

Sai Pallavi: సాయి పల్లవికి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన అల్లు అరవింద్!

  • Published Jul 19, 2024 | 10:52 AM Updated Updated Jul 19, 2024 | 10:58 AM

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తో పాటుగా తండేల్ మూవీ టీమ్ సాయి పల్లవికి సర్ప్రైజ్ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తో పాటుగా తండేల్ మూవీ టీమ్ సాయి పల్లవికి సర్ప్రైజ్ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..

Sai Pallavi: సాయి పల్లవికి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన అల్లు అరవింద్!

సాయి పల్లవి.. టాలీవుడ్ లో ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన దగ్గరికి వచ్చిన కథలను కాకుండా.. తనకు నచ్చిన కథలను ఎంచుకుంటూ.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరచుకుంది. ప్రస్తుతం అక్కినేని నాగచైత్యనతో ‘తండేల్’ అనే మూవీలో లీడ్ రోల్ చేస్తోంది. ఈ చిత్రానికి చందు మెుండేటి డైరెక్టర్. తాజాగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తో పాటుగా తండేల్ మూవీ టీమ్ సాయి పల్లవికి సర్ప్రైజ్ ఇచ్చారు.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, డైరెక్టర్ చందు మెుండేటితో పాటుగా ‘తండేల్’ మూవీ టీమ్ సర్ప్రైజ్ ఇచ్చింది. మూవీ టీమ్ సాయి పల్లవితో కేక్ కట్ చేయించారు. ఈ ఊహించని పరిణామాకి న్యాచురల్ బ్యూటీ సర్ప్రైజ్ అయ్యింది. అయితే ఇలా కేట్ కట్ చేయించడానికి కారణం ఏంటంటే? సాయి పల్లవి ఇటీవల ప్రకటించిన సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో రెండు అవార్డులను దక్కించుకుంది. గార్గి, విరాట పర్వం చిత్రాల్లో నటనకు గాను ఈ అవార్డులను దక్కించుకుంది. దాంతో ఈ బ్యూటీ ఖాతాలో 6 ఫిల్మ్ ఫేర్ వార్డులు చేరిపోయాయి. దాంతో ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకున్న నటిగా ఆమె రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా తండేల్ మూవీ యూనిట్ సభ్యులు ఆమెను సత్కరించారు.  ప్రస్తుతం తండేల్ మూవీతో పాటుగా మరికొన్ని చిత్రాల్లో సాయి పల్లవి నటిస్తోంది.

jojobetjojobet girişjojobetjojobet girişjojobetjojobet girişjojobet güncel giriş