iDreamPost
android-app
ios-app

Rishab Shetty: బాలీవుడ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రిషబ్ శెట్టి! ఏమన్నాడంటే?

  • Published Aug 21, 2024 | 12:17 PM Updated Updated Aug 21, 2024 | 12:17 PM

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నేషనల్ అవార్డ్ విన్నర్ రిషబ్ శెట్టి బాలీవుడ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆ కామెంట్స్ ఇండస్ట్రీలో పెద్ద దుమారం లేపాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నేషనల్ అవార్డ్ విన్నర్ రిషబ్ శెట్టి బాలీవుడ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆ కామెంట్స్ ఇండస్ట్రీలో పెద్ద దుమారం లేపాయి.

Rishab Shetty: బాలీవుడ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రిషబ్ శెట్టి! ఏమన్నాడంటే?

రిషబ్ శెట్టి.. ‘కాంతార’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. అదీకాక ఈ మూవీలో నటనకు గాను ఈ కన్నడ హీరోకు నేషనల్ అవార్డు సైతం వచ్చింది. కాగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రిషబ్ శెట్టి బాలీవుడ్ పై తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆ ఇండస్ట్రీపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి బాలీవుడ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. రిషబ్ శెట్టి మాట్లాడుతూ..”కొన్ని ఇండియన్ సినిమాలు, మరీ ముఖ్యంగా బాలీవుడ్ చిత్రాలు మన దేశాన్ని తక్కువ చేసి చూపిస్తున్నాయి. భారతీయ సినిమాలకు రెడ్ కార్పెట్ వేసి మరీ  గ్లోబల్ ఈవెంట్స్ కు ఆహ్వానిస్తారు. అలాంటి మూవీస్ ను బాలీవుడ్ వాళ్లు తక్కువ చేసి చూపిస్తున్నారు. అందుకే నేను దేశం గురించి గర్వంగా మాట్లాడేలా చేయాలనుకుంటున్నా. నా దేశం, నా రాష్ట్రం, నా భాష గురించి ప్రపంచానికి గొప్పగా చెప్పాలనుకుంటున్నా” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలో వివాదాస్పదంగా మారాయి. ఇక ఈ వ్యాఖ్యల విషయంలో కొందరు రిషబ్ శెట్టికి మద్ధతు పలుకుతుంటే.. మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. మరి కన్నడ స్టార్ హీరో కామెంట్స్ పై బాలీవుడ్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.