iDreamPost
android-app
ios-app

Kasthuri Shankar: RCB పై షాకింగ్ పోస్ట్ చేసిన నటి..ఓ ఆట ఆడేసుకున్న ఫ్యాన్స్‌

  • Published May 24, 2024 | 7:17 PMUpdated May 25, 2024 | 7:12 AM

ఇటీవలే రాజస్థాన్‌ చేతిలో ఓటమి పాలైనా ఆర్సీబీని చాలామంది ట్రోల్స్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో తాజాగా మరో నటి కూడా ఆర్సీబీని ట్రోల్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ లు పెట్టింది. దీంతో ఆ నటిపై ఆర్సీబీ ఫ్యాన్స్‌ ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ఇంతకి ఆమె ఎవరంటే..

ఇటీవలే రాజస్థాన్‌ చేతిలో ఓటమి పాలైనా ఆర్సీబీని చాలామంది ట్రోల్స్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో తాజాగా మరో నటి కూడా ఆర్సీబీని ట్రోల్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ లు పెట్టింది. దీంతో ఆ నటిపై ఆర్సీబీ ఫ్యాన్స్‌ ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ఇంతకి ఆమె ఎవరంటే..

  • Published May 24, 2024 | 7:17 PMUpdated May 25, 2024 | 7:12 AM
Kasthuri Shankar: RCB  పై షాకింగ్ పోస్ట్ చేసిన నటి..ఓ ఆట ఆడేసుకున్న ఫ్యాన్స్‌

ఈ ఏడాది ఐపీఎల్‌-2024లో ఎలిమినేటర్‌లో రాజస్థాన్ చేతిలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఓటమిపాలైనప్పటకి.. తమ అద్భుతమైన ఆటతీరుతో అందరని ఆకట్టుకుంది. అంతేకాకుండా పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానం నుంచి ప్లే ఆఫ్స్‌కు చేరేందుకు ఆర్సీబీ తీవ్రంగా శ్రమించింది. వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో గెలిచిన ఆర్సీబీ  ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. కానీ, దురదృష్టవశాత్తూ ఎలిమినేటర్‌ రౌండ్‌ను దాటలేకపోయింది. ఇక రాజస్తాన్‌ చేతిలో ఓటమి పాలై టోర్నీ నుంచి బెంగళూరు ఇంటిముఖం పట్టింది. దీంతో ఈ సాలా కప్ నమ్దే అంటూ సందడి చేసిన ఆర్సీబీ ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశే ఎదురైంది.

కాగా ఈ ఏడాది సీజన్‌లో ఆర్సీబీ తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్లో సీఎస్‌కేపై విజయం సాధించి ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలిమినేటర్‌లో ఆర్సీబీ ఓడిపోవడంతో కొంతమం‍ది సీఎస్‌కే అభిమానులు బెంగళూరు జట్టును ట్రోల్ చేస్తున్నారు.  ఈ క్రమంలోనే.. తాజాగా ఇప్పుడు మరో హీరోయిన్‌ కూడా ఆర్సీబీని ట్రోల్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ లు పెట్టింది. ఇంతకి ఆమె ఎవరంటే..

ఇటీవలే రాజస్థాన్‌ చేతిలో ఓటమి పాలైనా ఆర్సీబీని చాలామంది ట్రోల్స్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో తాజాగా మరో నటి కూడా ఆర్సీబీని ట్రోల్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ లు పెట్టింది.  ఆమె మరెవరో కాదు.. నటది కస్తూరి శంకర్‌. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తరుచు వివాదాలకు కేరాఫ్‌ అడ్రాస్‌ గా నిలుస్తూ.. ఏదో ఒక కాంట్రవర్సీని క్రియేట్‌ చేస్తూ ఉంటుంది ఈ నటి. అంతేకాకుండా.. అందర్నీ రెచ్చగొట్టేలా ఏదో ఒక రకంగా విమర్శలు చేస్తూ.. ఎవరో ఒకరిపై మండిపడుతూ నెట్టింట వైరల్‌ అవుతు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే.. తాజాగా కస్తూరి ఆర్సీబీ గురించి ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. కాగా, ఆమె చేసిన పోస్ట్‌ లో బెంగళూరు దండు (బెంగళూరు కంటోన్మెంట్) రైల్వే స్టేషన్‌లోని నేమ్ బోర్డు ఫోటోను షేర్ చేసింది. దానిలో బెంగళూరు కంటోన్మెంట్ అంటే ఇంగ్లిష్ లో బెంగళూరు కంట్ అని అర్థం వచ్చేలా.. దానిలోని ఎడిట్ చేసి ఉంది. అంటే.. బెంగుళూరు వల్ల కాదు అనే అర్థం వచ్చేలా ఆ ఫోటోను షేర్ చేసింది.

Kasturi

అయితే నిజానికి ఈ పోస్ట్‌ ను చెన్నై ఆటగాడు తుషార్ దేశ్‌పాండే షేర్ చేశాడు. ఎందుకంటే.. చెన్నై ఓటమితో తీవ్ర నిరాశకు గురైన తుషార్ దేశ్‌పాండే, బెంగళూరు ఓడిపోయే వరకు వేచి ఉండి.. ఆ తర్వాత ఈ ఫోటోను షేర్ చేశాడు. ఇక ఇప్పుడు నటి కస్తూరి శంకర్‌ కూడా అదే చిత్రాన్ని కాపీ చేసి, అదే పోస్ట్‌ను తన ఖాతాలో షేర్ చేసింది. అయితే కస్తూరి చేసిన పోస్ట్‌ పై RCB అభిమానులు ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ ఐపీఎల్‌లో చెన్నైని RCB ఓడించిన తీరును కొందరు ఆమెకు గుర్తు  చేస్తున్నారు. అలాగే మోసం చేసినందుకు చెన్నై జట్టుపై రెండేళ్ల నిషేధం విధించిన విషయాన్ని మరికొందరు గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే చాలామంది కస్తూరి పై అసభ్యకరమైన వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఇలా మొత్తానికి కస్తూరి చేసిన పోస్ట్‌ కు గాను ఆర్సీబీ ఫ్యాన్స్ ఓ ఆడుకుంటున్నారు. మరి, నటి కస్తూరి RCB పై చేసిన పోస్ట్‌ పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి