iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో విషాదం.. ఫస్ట్‌ మూవీ విడుదలకు ముందే దర్శకుడు అనుమానాస్పద మృతి!

  • Published Jun 27, 2023 | 5:36 PM Updated Updated Jun 27, 2023 | 5:36 PM
  • Published Jun 27, 2023 | 5:36 PMUpdated Jun 27, 2023 | 5:36 PM
ఇండస్ట్రీలో విషాదం.. ఫస్ట్‌ మూవీ విడుదలకు ముందే దర్శకుడు అనుమానాస్పద మృతి!

ఇండస్ట్రీని విషాదలు వదలడం లేదు. ఏడాది ప్రారంభం అనేక మంది సినీ సెలబ్రిటీలు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. వీరిలో కొందరు సహజంగా మృతి చెందితే.. మరి కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. కొందరు అనుమానాస్పద రీతిలో మృత్యువాత పడుతున్నారు. తాజాగా యువ దర్శకుడు ఒకరు మృతి చెందారు. అయితే అతడి మృతిపై సదరు దర్శకుడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మలయాళ చిత్ర దర్శకుడు బైజు పరవూర్ జూన్ కేరళలోని కొచ్చిలో కన్నుమూశారు. అయితే ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికి మీడియా కథనాల ప్రకారం ఫుడ్ పాయిజనింగ్‌తో మృతి చెందినట్లు భావిస్తున్నారు.

ఏం జరిగింది అంటే..

మృతి చెందిన దర్శకుడు బైజు పరవూర్‌.. జూన్ 24న కోజికోడ్‌లోని ఒక హోటల్‌లో భోజనం చేశారు. అయితే ఇంటికి వచ్చిన వెంటనే ఏదో అసౌకర్యంగా అనిపించడంతో కేరళలోని కున్నంకులంలో ఉన్న తన భార్య ఇంటికి వెళ్లాడు. బైజు ఇబ్బంది గురించి తెలుసుకున్న అతడి భార్య.. దర్శకుడిని.. అక్కడే ఉన్న స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స ఇప్పించింది. కాసేపటికి సమస్య తగ్గినట్లు అనిపించడంతో.. బైజు పరవూరులోని తన ఇంటికి తిరిగి వెళ్లాడు.

ఆ తర్వాత కాసేపటికే బైజు పరిస్థితి విషమించడంతో అతడిని కొచ్చిలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెంటనే అతడికి చికిత్సఅందించడం ప్రారంభించారు. ఈ క్రమంలో బైజు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అయితే బైజు మృతిపై అతడి కుటుంబ సభ్యులు, సన్నిహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్‌ పాయిజన్‌ ​​కారణంగా బైజు చనిపోయాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా.. బైజు దాదాపు 45 సినిమాల్లో ప్రొడక్షన్ కంట్రోలర్‌గా పనిచేశారు. త్వరలోనే తాను తెరకెక్కించిన సినిమా సీక్రెట్ రిలీజ్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. తాను దర్శకత్వం వహించిన సినిమా విడుదలను చూడకముందే.. బైజు కన్నుమూయడం విచారకరం అంటున్నారు.