iDreamPost
android-app
ios-app

ఎయిర్ ఇండియా విమానంలో ప్రముఖ నటికి చేదు అనుభవం..!

ఎయిర్ ఇండియా విమానంలో ప్రముఖ నటికి చేదు అనుభవం..!

ప్రముఖ విమానాయన సంస్థ ఎయిరిండియా మరోసారి వివాదాలతో వార్తల్లో నిలిచింది. గతంలో ఎయిరిండియా విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళపై తోటి ప్రయాణీకుడు మద్యం సేవించి మూత్రం పోసిన ఘటన చోటుచేసుకుంది. అలాగే సాధారణ వ్యక్తులే కాకుండా సెలబ్రిటీలు సైతం చేదు అనుభవాలను ఎదుర్కొన్న సంఘటనలు వెలుగుచూశాయి. తాజాగా ప్రముఖ నటి తనకు ఎయిర్ ఇండియాలో ఎదురైన అవమానకరమైన సంఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విమానంలో ప్రయాణించే సమయంలో తనను తోటి ప్రయాణీకుడు వేధించాడంటూ పేర్కొంది. నటి ఈ విషయాన్ని సోషల్ మీడియా హ్యాండిల్ ఇన్ స్టా గ్రామ్ ద్వారా పంచుకోవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ నటి ఎవరంటే..?

మాలీవుడ్ ప్రముఖ నటి దివ్య ప్రభకు ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణీస్తుండగా చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా పంచుకున్నారు. ముంబై నుండి కొచ్చికి వస్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎఐ 681లో అవాంతర సంఘటన జరిగిందని, మీ దృష్టికి తీసుకు వస్తున్నానని, మద్దతునివ్వాలని కోరింది. తోటి ప్రయాణీకుడు.. మద్యం సేవించి.. నన్ను వేధించాడు. ఈ విషయం ఎయిర్ హోస్టెస్‌కి చెప్పినప్పటికీ.. టేకాఫ్ ముందు తనను మరో సీటుకు మాత్రమే మార్చారు. అతడిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కొచ్చి విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్ లైన్ అధికారులకు ఫిర్యాదు చేశాను. విమానాశ్రయంలోని పోలీసుల వద్దకు నన్ను పంపారు. అలాగే కేరళ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసి, ఈ ఘటనపై దర్యాప్తు చేయమని కోరాను అంటూ దానికి సంబంధించని స్క్రీన్ షాట్లను జోడించింది దివ్య ప్రభ. ఎయిర్ ఇండియా గ్రౌండ్ ఆఫీస్, విమాన సిబ్బంది స్పందించకపోవడంతో అసంతృప్తితో ఉన్నట్లు పేర్కొంది.

 

View this post on Instagram

 

A post shared by Divyaprabha (@divya_prabha__)

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş