iDreamPost
android-app
ios-app

గుంటూరు కారంలో ఛాన్స్ కొట్టేసిన ఖుషిత కల్లపు.. పోస్ట్ వైరల్!

గుంటూరు కారంలో ఛాన్స్ కొట్టేసిన ఖుషిత కల్లపు.. పోస్ట్ వైరల్!

ఖుషిత కల్లపు అంటే చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు. కానీ, బజ్జీల పాప అంటే మాత్రం టక్కున గుర్తు పట్టేస్తారు. అప్పుడెప్పుడో ఓ పబ్ మీద దాడి జరిగినప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే? ఛీజ్ బజ్జీలు తినడానికి వచ్చినట్లు చెప్పింది. ఆ ఆన్సర్ తో అటు సోషల్ మీడియాలోనే కాకుండా.. ఇండస్ట్రీలో కూడా బాగా పాపులర్ అయిపోయింది. అంతక ముందు సోషల్ మీడియా, రీల్స్ తో ఫేమస్ అయిన ఈ భామ.. ఆ తర్వాత బజ్జీల పాపగా ఫుల్ ఫేమస్ అయింది.

ఖుషితాకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఓపెనింగ్స్ కూడా బాగా చేస్తూ ఉంటుంది. రవితేజ టీం వర్క్స్ బ్యానర్ మీద నిర్మించిన చిత్రంలో అవకాశం దక్కించుకుంది. చాంగురే బంగారు రాజా సినిమాల హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇటీవలే రామబాణం సినిమాలో ఓ చిన్న పాత్ర కూడా పోషించింది. అయితే ఆ పాత్ర అంత క్లిక్ కాలేదు. ఇప్పుడు ఈ భామ మరో క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసింది. అది కూడా అలాంటి ఇలాంటి ప్రాజెక్టు కాదు.

 

View this post on Instagram

 

A post shared by Kushithakallapu (@kushithakallapu)

ఏకంగా మహేశ్ బాబు సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించింది. మేకప్ రూమ్ రెండు జడలు వేసుకుని రెడీ అయిన పిక్స్ షేర్ చేసింది. ఆ పోస్ట్ కి హ్యాష్ ట్యాగ్ SSMB28 అని పెట్టింది. ఈ పోస్టుతోనే ఖుషితాకి గుంటూరు కారం సినిమాలో ఛాన్స్ వచ్చింది అని క్లారిటీ వచ్చింది. కెరీర్ స్టార్టింగ్ సమయంలో ఖుషితాకి ఇది చాలా మంది అవకాశంగా చెబుతున్నారు. హీరోయిన్ గా చిత్రం విడుదల సమయంలో మహేశ్ బాబు సినిమాలో అవకాశం దక్కడం కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Kushithakallapu (@kushithakallapu)