iDreamPost
android-app
ios-app

John Abraham: ఆ యాడ్స్​లో నటించడమంటే చావును అమ్మడమే.. బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం కామెంట్స్!

  • Published Aug 09, 2024 | 9:00 PM Updated Updated Aug 09, 2024 | 9:00 PM

డబ్బుల కోసం అమాయకులను బలి చేయొద్దని ఓ స్టార్ హీరో అంటున్నాడు. అలాంటి యాడ్స్​లో నటించడమంటే చావును అమ్మడమేనని చెబుతున్నాడు.

డబ్బుల కోసం అమాయకులను బలి చేయొద్దని ఓ స్టార్ హీరో అంటున్నాడు. అలాంటి యాడ్స్​లో నటించడమంటే చావును అమ్మడమేనని చెబుతున్నాడు.

  • Published Aug 09, 2024 | 9:00 PMUpdated Aug 09, 2024 | 9:00 PM
John Abraham: ఆ యాడ్స్​లో నటించడమంటే చావును అమ్మడమే.. బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం కామెంట్స్!

సెలబ్రిటీలు యాడ్స్​లో నటించడం కామనే. మన దేశంలో క్రికెటర్లతో పాటు ఫిల్మ్ స్టార్స్ ఎక్కువగా అడ్వర్టయిజ్​మెంట్స్​లో కనిపిస్తుంటారు. వీటిల్లో నటించినందుకు గానూ భారీ మొత్తంలో పారితోషికాలు అందుకుంటారు. అయితే కొన్ని యాడ్స్​లో నటించినందుకు నటులపై విమర్శలు వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా పాన్ మసాలా యాడ్స్​ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి. ఇలాంటి అడ్వర్టయిజ్​మెంట్స్​లో కనిపించినందుకు గానూ పలువురు క్రికెటర్లతో పాటు సినీ తారల మీద కూడా భారీగా విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ అంశంపై బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహాం రియాక్ట్ అయ్యారు. ఆ యాడ్స్​లో నటించడమంటే చావును అమ్మడమేనని ఆయన అన్నారు.

పాన్ మసాలా అడ్వర్టయిజ్​మెంట్లలో నటిస్తూ కొందరు తారలు అమాయకులను బలి చేస్తున్నారని జాన్ అబ్రహాం సీరియస్ అయ్యారు. సెలబ్రిటీలు నిజాయితీతో ఉండాలని, రెండు ముఖాలు ఉండటం కరెక్ట్ కాదన్నారు. పాన్ మసాలా, మౌత్ ఫ్రెష్నర్స్ లాంటి యాడ్స్​లో నటించొద్దని తాను డెసిషన్ తీసుకున్నానని.. అలాంటి కంపెనీలతో జతకట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘కొందరు నటులు ఫిట్​నెస్​ గురించి గొప్పలు చెబుతారు. వాళ్లే పాన్ మసాలా యాడ్స్​లోనూ నటిస్తారు. నేను ఏ యాక్టర్​నూ అగౌరవపర్చట్లేదు. కానీ ఇది కరెక్ట్ కాదు. నేనైతే చావును ఇలా అమ్మను’ అని జాన్ అబ్రహాం చెప్పుకొచ్చారు.

ప్రతి ఏటా పాన్ మసాలా ఇండస్ట్రీ 45 వేల కోట్ల టర్నోవర్​ రాబడుతోందని జాన్ అబ్రహాం తెలిపారు. వాళ్లకు సర్కారు నుంచి కూడా మద్దతు ఉందని.. అందుకే ఆ వ్యాపారం ఇంకా లీగల్​గా చలామణి అవుతోందన్నారు. ఇలాంటి యాడ్స్​లో నటించడం ద్వారా అమాయకుల జీవితాలను నాశనం చేస్తున్నారని.. పాన్ మసాలా వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు జాన్ అబ్రహాం. ఇక, ఈ హీరో నటించిన ‘వేదా’ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగానే ప్రమోషన్స్​లో పాల్గొన్న జాన్ అబ్రహాం పైవ్యాఖ్యలు చేశారు. ‘వేదా’ మూవీని అందరూ తప్పక చూడాలని కోరారు. మన దేశంలో స్త్రీలు, పిల్లలకు రక్షణ లేదని.. అలాంటి పలు విషయాల గురించి ఇందులో తెలియజేశామని వివరించారు.