పల్లవి ప్రశాంత్ మంచి మనసు.. రైతు కుటుంబానికి అండగా!

పల్లవి ప్రశాంత్ మంచి మనసు.. రైతు కుటుంబానికి అండగా!

Pallavi Prasanth: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్  బిడ్డ గురించి అందరికీ తెలిసిందే. తాజాగా ఈయన ఓ రైతు కటుంబాన్ని ఆదుకుంటూ తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..

Pallavi Prasanth: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్  బిడ్డ గురించి అందరికీ తెలిసిందే. తాజాగా ఈయన ఓ రైతు కటుంబాన్ని ఆదుకుంటూ తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..

‘పల్లవి ప్రశాంత్’.. ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమే. ఎందుకంటే.. ఈయన ఒక రైతు బిడ్డగా తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొని విన్నర్ నిలిచాడు. ఇక ఈ షో పుణ్యమా అంటూ సామాన్యుడు కాస్త ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయాడు. దీంతో ఎక్కడ చూసిన పల్లవి ప్రశాంత్ కు సంబంధించి ఏ చిన్న వార్త అయిన వైరల్ గా మారుతుంది. ముఖ్యంగా హోస్ లో ఒక కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ తన ఆట, మాట తీరుతో చాలామంది మనసులను గెలుచుకున్నాడు. అంతేకాకుండా.. విన్నర్ గా నిలిచిన తర్వాత పల్లవి ప్రశాంత్ ప్రైజ్ మనీ మొత్తం రైతులకు పంచిపెడతానని కోట్లాది మంది ప్రేక్షకుల సాక్షిగా ప్రమాణం చేశాడు. ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్.. ఇటీవలే రెండు పేద కటుంబాలకు తన వంతు ఆర్థిక సాయం చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి ఓ కుటుంబాన్ని ఆదుకుంటూ తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్  బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ టైటిల్  కొట్టాడమే కాకుండా.. రూ35 లక్షల ప్రైజ్ మనీ కూడా అందుకున్నాడు. ఇక అందులో అన్ని టాక్స్ లు పోగా అందులో పల్లవి ప్రశాంత్ కు మిగిలినవి రూ.16 లక్షలు మాత్రమే.  అయితే గెలిచినా ప్రైజ్ మనీ మొత్తాన్ని రైతులకు పంచి పెడతనని గతంలో పల్లవి ప్రశాంత్ ప్రమాణం చేశాడు. ఇందులో భాగంగానే..  ఓ రెండు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించగా.. ఇప్పుడు మరోసారి ఓ రైతు కుటుంబాన్ని ఆదుకోని తన గొప్ప మనసు చాటుకున్నాడు. తాజాగా మెదక్‌‌లోని చిన శంకరపేట్‌కి చెందిన పరమేశ్వర్ (32) అనే వ్యక్తి గత కొన్ని రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. అయితే అతనికి భార్య శంకరమ్మతో పాటు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. అయితే కుటుంబానికి ఆధారంగా ఉన్న భర్త చనిపోవడంతో శంకరమ్మ.. తన ముగ్గురు ఆడ బిడ్డలను పెంచడం కష్టంగా మారింది.

దీంతో పేద రైతులకు సాయం చేస్తానని మాట ఇచ్చిన పల్లవి ప్రశాంత్ శంకరమ్మ ఇంటికి వెళ్లి రూ.20 వేలు ఆర్థికసాయం అందించారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అలాగే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి అండగా నేనున్నా.. జై జవాన్ జై కిసాన్ అంటూ ఈ వీడియోను పల్లవి ప్రశాంత్ షేర్ చేశాడు. అయితే ఇప్పటికే పల్లవి ప్రశాంత్ ప్రైజ్ మనీని రైతులకు పంచడంలేదని విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఈ వీడియో చూసైనా పల్లవి ప్రశాంత్ ట్రోల్స్ ఆగుతాయో లేదో చూడాల్సి ఉంది. మరీ, పల్లవి ప్రశాంత్ మరో రైతు కుటుంబానికి ఆదుకోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments