Dharani
Dharani
సినిమా అనేది ఓ అందమైన రంగుల ప్రపంచం. టాలెంట్ కన్నా కూడా పైకి కనిపించే అందానికే ఇక్కడ అధిక ప్రాధాన్యం. వయసు పైబడుతున్న కొద్ది అవకాశాలు సన్నగిల్లుతాయి. అన్నింటకంటే ముఖ్యం వరుస విజయాలు సాధిస్తేనే.. చిత్ర పరిశ్రమలో రాణించగలుగుతాం. ఒక్కసారి ఫ్లాప్లు మన ఇంటి తలుపు తట్టాయా.. ఇక అప్పటి నుంచి మనం పరిశ్రమకు మెల్లిగా దూరమవుతాం. జీవితంలో గెలుపోటములు సహజం.. గెలిచినప్పుడు విర్రవీగకూడదు.. ఓడినప్పుడు క్రుంగి పోకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే.. ఒకే విధంగా స్పందించే స్థిత ప్రజ్ఞత అలవర్చుకోవాలి. అలాంటి మనిషి జీవితాంతం ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. ఇక సినీ పరిశ్రమలో ఉన్న వారికి ఇలాంటి స్థిత ప్రజ్ఞత ఎక్కువ అవసరం. లేదంటే జీవితాలే నాశనం చేసుకునే పరిస్థితులు తలెత్తుతాయి.
ఇండస్ట్రీ అనేది ఓ రంగుల లోకం..ఈ వెలుగుజిలుగులు శాశ్వతం కాదు అని తెలుసుకున్న కొందరు నటీనటులు.. ఈ జీవిత పరమార్థం తెలుసుకుని.. భౌతిక సుఖాలను వదిలి.. ఆధ్యాత్మిక మార్గం ఎంచుకున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే నటి ఈ కోవకు చెందినామెనే. ఒకప్పుడు తన అందంతో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపింది. అందాల పోటీల్లో పాల్గొంది. గ్లామర్ ప్రపంచంలో మకుటం లేని మహారాణిగా రాణించింది. ఆమె ఓరకంట చూస్తే చాలు.. కుర్రాళ్లుకు హార్ట్ ఎటాక్ వచ్చేది. తన గ్లామర్తో వారికి చెమటలు పట్టించింది. సినిమాల్లో రాణిస్తూ స్టార్డం, డబ్బు అన్ని సంపాదించినా ఏదో అసంతృప్తి ఆమెను వెంటాడేది. జీవితం అంటే ఇది కాదని అనిపించేది. దాంతో ఓ రోజు అన్నాళ్లు తాను అనుభవించిన లగ్జరీ జీవితాన్ని వదిలి.. సన్యాసినిగా మారింది. ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తూ.. ప్రశాంత జీవితం గడుపుతోంది.. ఇంతకు ఎవరా నటి అంటే..
బర్ఖా మదన్ అనగానే గుర్తు పట్టడం కష్టం. కానీ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హిందీ చిత్రం భూత్లో దెయ్యం పట్టిన మంజీత్ పాత్రలో నటించిన యువతి అంటే టక్కున గుర్తు పట్టడమే కాక.. ఆమె యాక్టింగ్ తలుచుకుని ఒక్క నిమిషం భయపడతారు కూడా. ఒకప్పుడు తన గ్లామర్తో కుర్రకారుకు గిలి గింతలు పెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత సన్యాసినిగా మారి అందరికి షాక్ ఇచ్చింది. మోడల్గా బర్ఖా కెరీర్ మొదలైంది. 1994 మిస్ ఇండియా పోటీల్లో తను కూడా పాల్గొంది. ఈ పోటీల్లో సుస్మిత సేన్ కిరీటం గెలుచుకోగా.. ఐశ్వర్య రాయ్ రన్నరప్గా నిలిచింది. ఇక వీరితో పాటు పోటీ పడిన బర్ఖా మిస్ టూరిజం ఇండియాగా నిలిచింది. ఆ తర్వాత రెండేళ్లకు బర్ఖా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.
అక్షయ్ కుమార్, రేఖ, రవినా టాండన్ ప్రధాన పాత్రలోల నటించిన యాక్షన్ చిత్రం ఖిలాడియోం కా ఖిలాడి చిత్రంలో నటించింది. ఈ చిత్రం బర్ఖాకు మంచి గుర్తింపు ఇచ్చింది. ఆ తర్వాత చాలా జాగ్రత్తగా పాత్రలను ఎంచుకుంటూ కెరీర్లో ముందుకు సాగింది. ఈ క్రమంలో రామ్ గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన భూత్ చిత్రంలో దెయ్యం పట్టిన యువతి మంజీత్ పాత్రలో నటించి.. ప్రేక్షకులను బీభత్సంగా భయపెట్టడమే కాక.. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది బర్ఖా. నటిగా రాణిస్తూనే.. ఆ తర్వాత పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించింది. ముందు నుంచి ఆమె దలైలామా ఫాలోవర్. ఈ క్రమంలో 2012లో బుద్ధిజం స్వీకరించాలని నిర్ణయించుకుంది. ఆ తర్వాత సన్యాసినిగా మారింది. ప్రస్తుతం ఆమెను గ్యాల్తేన్ సంతేన్గా పిలుస్తారు. ఇక ఆమె తరచుగా తన ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.