Balakrishna: నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు అందరికీ ఆహ్వానం: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్

Nandamuri Balakrishna Golden Jubilee Celebrations: నందమూరి బాలకృష్ణ 50 వసంతాల ఫంక్షన్ ను గ్రాండ్ గా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది తెలుగు ఫిల్మ్ ఛాంబర్. ఈ వేడుకకు అందరూ ఆహ్వానితులే అంటూ తాజాగా ఆహ్వానించింది తెలుగు చిత్ర పరిశ్రమ.

Nandamuri Balakrishna Golden Jubilee Celebrations: నందమూరి బాలకృష్ణ 50 వసంతాల ఫంక్షన్ ను గ్రాండ్ గా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది తెలుగు ఫిల్మ్ ఛాంబర్. ఈ వేడుకకు అందరూ ఆహ్వానితులే అంటూ తాజాగా ఆహ్వానించింది తెలుగు చిత్ర పరిశ్రమ.

నందమూరి బాలకృష్ణ ఆగస్ట్ 30తో ఇండస్ట్రీలోకి వచ్చి 50 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు చలన చిత్ర పరిశ్రమ బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో ఈ కార్యక్రమాన్ని అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. ఎంతో మంది అతిరథమహారథులు పాల్గొనబోతున్నారు.అయితే కొంతమందికి ఆహ్వానాలు అందలేదని వస్తున్న వార్తలపై తాజాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించింది.

నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనుంది. ఇక ఈ వేడుకలకు సంబంధించి ఇప్పటికే అన్ని సౌత్ ఇండియా సినీ పెద్దలకు, దేశ వ్యాప్తంగా ఉన్న అతిరథమహారథులకు ఆహ్వానాలను ఫిలిం ఛాంబర్ అందించింది. అయితే కొందరికి ఆహ్వానాలు అందలేదన్న వార్తలు వచ్చాయి. ఈ న్యూస్ పై తాజాగా స్పందించిన ఫిల్మ్ ఛాంబర్ ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చింది. ఈ సమావేశంలో ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ..”బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలను తెలుగు సినీ పరిశ్రమలోని అన్ని శాఖలు కలిసి నిర్వహిస్తున్నాయి. ఇక ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పలువురు ప్రముఖులు హాజరుకాబోతున్నారు. ఇతర రాష్ట్రాల సినీ పరిశ్రమకు చెందిన స్టార్స్ కూడా ఈ వేడుకకు రాబోతున్నారు. అయితే కొంత మందికి ఆహ్వానాలు అందలేదని ఫిర్యాదులు అందాయి. అన్ని యూనియన్ల సభ్యులకు పీడీఎఫ్ రూపంలో ఆహ్వానాలు పంపాము. ఇన్విటేషన్ ఎవరికైనా రాకపోతే.. తెలుగు ఇండస్ట్రీ మన కుటుంబం అని భావించి ప్రతీ ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. ఇదే మా వ్యక్తిగత ఆహ్వానం” అని చెప్పుకొచ్చారు.ఈ కార్యక్రమంలో కేఎల్ఎన్ కళ్యాణ్, అనుపమ్ రెడ్డి, చదలవాడ శ్రీనివాసరావు, సుచిర్ ఇండియా కిరణ్, మాదాల రవి, సి కళ్యాణ్, భరత్ భూషణ్, దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్, శివ బాలాజీ, పరుచూరి గోపాలకృష్ణ, అశోక్ కుమార్, మాదవపెద్ది సురేష్, సుబ్బారెడ్డి, అనిల్ కుమార్ వల్లభనేని, బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.

Show comments