iDreamPost

ఆస్పత్రిలో నటి ఖుష్బూ.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా అంటూ ట్వీట్.

  • Author Soma Sekhar Published - 06:22 PM, Fri - 23 June 23
  • Author Soma Sekhar Published - 06:22 PM, Fri - 23 June 23
ఆస్పత్రిలో నటి ఖుష్బూ.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా అంటూ ట్వీట్.

సీనియర్ నటి, కేంద్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుష్బూ ఆస్పత్రిపాలైయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ఖుష్బూ. గత కొన్ని రోజులుగా పలు ఆరోగ్య కారణాలతో తరచుగా ఆమె ఆస్పత్రిలో జాయిన్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆస్పత్రిలో చేరారు.

నటి ఖుష్బూ.. 90వ దశకంలో తన నటనతో, అందంతో కుర్రాళ్ల గుండెలను కొల్లగొట్టారు. తెలుగులో సైతం స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈమెకు ఓ అభిమాని గుడి కట్టిన సంగతి మనకు తెలియనిది కాదు. ప్రస్తుతం అటు రాజకీయాలతో, ఇటు అడపాదడప సినిమాలతో, టీవీ షోలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం జబర్దస్త్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆమె చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆస్పత్రి బెడ్ పై సెలైన్ ఎక్కించుకుంటున్న పిక్ ను ఆమె షేర్ చేశారు. దాంతో కుష్బూకు ఏమైందని అభిమానులు ఆందోళనకు గురి అవుతున్నారు. అయితే తాను కోకిక్స్ బోన్ (టెయిల్ బోన్) చికిత్స కోసం ఆస్పత్రిలో జాయిన్ అయినట్లు తెలిపింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను, త్వరలోనే పూర్తిగా నయం అవుతుందని ఆశిస్తున్నాను అంటూ ఆ ట్వీట్ లో పేర్కొంది. దీంతో అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి