iDreamPost
android-app
ios-app

ఆ ప్రమాదంతో చావును దగ్గర నుంచి చూశా: విశాల్ షాకింగ్ కామెంట్స్

  • Author Soma Sekhar Published - 09:55 PM, Fri - 11 August 23
  • Author Soma Sekhar Published - 09:55 PM, Fri - 11 August 23
ఆ ప్రమాదంతో చావును దగ్గర నుంచి చూశా: విశాల్ షాకింగ్ కామెంట్స్

వెండితెరపైకి ఓ సినిమా రావాలి అంటే ఎంత కష్టపడాలో మనకు తెలియనిది కాదు. వందల మంది టెక్నీషియన్లు రాత్రి, పగలు కష్టపడితే గానీ సినిమా థియేటర్లలోకి రాదు. ఇక సినిమాల కోసం హీరోలు, హీరోయన్లు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇక ఫైట్ సీన్లలో హీరోలు కొన్ని ప్రమాదకర సన్నివేశాలు చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే వారు కొన్నికొన్ని సార్లు ప్రమాదాల బారిన పడుతూ ఉంటారు. నేనూ అలాగే ప్రమాదం బారిన పడ్డాను అంటూ షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు హీరో విశాల్. ఓ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంతో చావును దగ్గర నుంచి చూశానని చెప్పుకొచ్చాడు.

హీరో విశాల్.. విభిన్నమైన కథలు ఎంచుకుంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. హిట్లు.. ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసే హీరోల్లో విశాల్ ఒకడు. ఇక ఇతడికి తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. భరణీ, పందెం కోడి లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చురగొన్నాడు. ప్రస్తుతం ‘మార్క్ ఆంటోని’ సినిమా చేస్తున్నాడు. రవిచంద్రన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 15న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా షూటింగ్ లో జరిగిన ఓ ప్రమాదం గురించి చెప్పుకొచ్చాడు విశాల్.

ఈ మూవీలో ఫైట్ సీన్ చేసి రెస్ట్ తీసుకుంటున్న టైమ్ లో ట్రక్కు నా వైపు దూసుకొచ్చిందని విశాల్ తెలిపాడు. ఈ ప్రమాదంతో చావును దగ్గర నుంచి చూశానని, ఈ ఘటనతో షాక్ కు గురై చాలా సేపు ట్రాన్స్ లో ఉన్ననంటూ చెప్పుకొచ్చాడు విశాల్. ప్రస్తుతం విశాల్ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. అయితే షూటింగ్స్ లో ప్రమాదాలు జరగడం ఇదే తొలిసారి కాదు. చాలా మూవీ షూటింగ్స్ లో ఎక్కువగా ఫైట్ సీన్స్ లో ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు ప్రాణాలు కూడా కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Vishal (@actorvishalofficial)


ఇదికూడా చదవండి: NTRతో కలిసి నటించిన ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా?