P Venkatesh
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5280 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఆ తేదీ వరకు కొనసాగనున్నది. ఆశావాహులు త్వరగా అప్లై చేసుకోండి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5280 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఆ తేదీ వరకు కొనసాగనున్నది. ఆశావాహులు త్వరగా అప్లై చేసుకోండి.
P Venkatesh
మీరు ఎప్పటి నుంచో బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? బ్యాంకు ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? అయితే మీలాంటి వారికి గుడ్ న్యూస్. దేశంలో ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ పలు సర్కిళ్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రక్రియను చేపట్టింది. భారీ స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇటీవలే ఎనిమిది వేలకు పైగా జూనియర్ అసోసియేట్ పోస్టులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ జాబ్స్ కు భర్తీ ప్రక్రియ కొనసాగుతుండగానే.. సర్కిల్ బెస్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఎస్బీఐ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 5280 రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటితో పాటు 167 బ్యాక్ లాగ్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు.
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఎస్బీఐ సర్కిళ్లలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు భర్తీ ప్రక్రియ చేపట్టింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 22న ప్రారంభమవగా.. డిసెంబర్ 12న ముగియాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఎస్బీఐ దరఖాస్తు గడువును పొడిగించింది. డిసెంబంర్ 17వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు ఎవరైనా దరఖాస్తు చేసుకోని వారు ఉంటే వారికి ఇది సువర్ణావకాశం. కాగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్ లో 425, అమరావతి సర్కిల్ లో 400 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని ఎస్బీఐ కోరింది. పూర్తి వివరాలకు ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ https://sbi.co.in/ ను సంప్రదించాలని సూచించింది.