iDreamPost
android-app
ios-app

టీమిండియా హెడ్ కోచ్​గా గంభీర్​ అంటూ వార్తలు.. ఒక్క కామెంట్​తో తేల్చేశాడు!

  • Published May 29, 2024 | 7:40 PMUpdated May 29, 2024 | 7:40 PM

భారత జట్టు నయా హెడ్ కోచ్​గా లెజెండ్ గౌతం గంభీర్ ఫైనలైజ్ అయ్యాడంటూ వార్తలు వస్తున్నాయి. అఫీషియల్ అనౌన్స్​మెంట్​ మాత్రమే బాకీ ఉందని, మిగిలిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయని టాక్ నడుస్తోంది. ఈ తరుణంలో ఒక్క కామెంట్​తో ఈ పోస్ట్ గురించి తేల్చేశాడు గౌతీ.

భారత జట్టు నయా హెడ్ కోచ్​గా లెజెండ్ గౌతం గంభీర్ ఫైనలైజ్ అయ్యాడంటూ వార్తలు వస్తున్నాయి. అఫీషియల్ అనౌన్స్​మెంట్​ మాత్రమే బాకీ ఉందని, మిగిలిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయని టాక్ నడుస్తోంది. ఈ తరుణంలో ఒక్క కామెంట్​తో ఈ పోస్ట్ గురించి తేల్చేశాడు గౌతీ.

  • Published May 29, 2024 | 7:40 PMUpdated May 29, 2024 | 7:40 PM
టీమిండియా హెడ్ కోచ్​గా గంభీర్​ అంటూ వార్తలు.. ఒక్క కామెంట్​తో తేల్చేశాడు!

టీమిండియా కొత్త హెడ్ కోచ్​గా ఎవరొస్తారనేది చర్చనీయాంశంగా మారింది. రాహుల్ ద్రవిడ్ వారసుడుగా అతడు వస్తే బెటర్.. కాదు ఇతడే కరెక్ట్ కంటూ ఫ్యాన్స్ కూడా పలువురి పేర్లు చెబుతూ డిస్కషన్స్​తో హోరెత్తిస్తున్నారు. ఆసీస్ దిగ్గజాలు రికీ పాంటింగ్, జస్టిన్ లాంగర్​తో పాటు కివీస్ లెజెండ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరు కోచ్ రేసులో బాగా వినిపించాయి. అయితే వీళ్లు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోలేదని అంటున్నారు. కోచ్ రేసులో అందరికంటే ఎక్కువగా ప్రచారం అవుతున్న పేరు గౌతం గంభీర్. కొత్త కోచ్​ను నియమించనున్నట్లు ప్రకటన చేసినప్పటి నుంచి గౌతీ పేరు వైరల్ అవుతోంది. దీనికి కారణం అతడి సక్సెస్ అనే చెప్పాలి. ప్లేయర్​గా టీమిండియాకు అపూర్వ సేవలు అందించిన అతడు.. కెప్టెన్​గా ఐపీఎల్​లో విజయవంతం అయ్యాడు.

అప్పట్లో కెప్టెన్​గా కేకేఆర్​కు ఐపీఎల్​ ట్రోఫీని అందించిన గంభీర్.. ఇప్పుడు మెంటార్​గా ఆ జట్టును ఛాంపియన్​ను చేశాడు. దీంతో భారత జట్టుకు కోచ్​గా అతడే కరెక్ట్ అనే డిమాండ్లు ఊపందుకున్నాయి. అతడితో భారత క్రికెట్ బోర్డు చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. వీటికి మరింత ఊతం ఇస్తూ ఐపీఎల్-2024 ఫైనల్ ముగిసిన తర్వాత గౌతీతో సుదీర్ఘంగా డిస్కస్ చేస్తూ కనిపించాడు బోర్డు సెక్రెటరీ జైషా. దీంతో హెడ్ కోచ్​గా గంభీర్ ఫైనలైజ్ అయ్యాడని అంతా ఫిక్స్ అయ్యారు. అఫీషియల్ అనౌన్స్​మెంట్​ మాత్రమే బాకీ ఉందని.. మిగిలిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయని టాక్ నడుస్తోంది. ఈ తరుణంలో ఒక్క కామెంట్​తో హెడ్ కోచ్​పై తేల్చేశాడు గంభీర్. ఇక మీదట కూడా తాను ఐపీఎల్​కు మాత్రమే పరిమితం కానున్నట్లు హింట్ ఇచ్చాడు. ఈ సీజన్​లో కోల్​కతా నైట్ రైడర్స్ విజేతగా నిలవడంపై గంభీర్ రియాక్ట్ అయ్యాడు.

కేకేఆర్ ఛాంపియన్​గా నిలిచినందుకు హర్షం వ్యక్తం చేశాడు గౌతీ. అయితే ఇక్కడితే ఏదీ అయిపోలేదని.. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని అన్నాడు. ‘ఇది జస్ట్ బిగినింగ్. ఐపీఎల్​ హిస్టరీలో మోస్ట్ సక్సెస్​ఫుల్​ టీమ్​గా నిలవాలంటే కేకేఆర్ ఇంకా 3 ట్రోఫీలు నెగ్గాలి. ఆ దిశగా మా ప్రయాణం ఇప్పుడే మొదలైంది’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్​కింగ్స్ చెరో 5 సార్లు ఐపీఎల్​ ట్రోఫీలు సాధించిన నేపథ్యంలో వాళ్లను దాటుతామంటూ అతడు ఆశాభావం వ్యక్తం చేశాడు. టీమిండియా హెడ్ కోచ్​ పదవిపై నేరుగా అతడు స్పందించలేదు. కానీ కేకేఆర్ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయిందని.. ఇంకా మూడు ట్రోఫీలు గెలవాలన్నాడు. దీంతో ఆ ఫ్రాంచైజీతో ఉండేందుకే గంభీర్ మొగ్గుచూపుతున్నాడని.. భారత జట్టు కోచింగ్ బాధ్యతలు తీసుకునే ఇంట్రెస్ట్ అతడికి లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కోల్​కతా ఆరు కప్పులు నెగ్గాకే.. అతడు ఇంటర్నేషనల్ కోచింగ్ సైడ్ వస్తాడని మరికొందరు అంటున్నారు. మరి.. గంభీర్ మాటల్లో మతలబు ఏంటో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి