iDreamPost
android-app
ios-app

దారుణం: అన్నం వండలేదని తల్లిని సజీవ దహనం చేసిన కుమారుడు!

  • Author naresh1 Published - 05:45 PM, Thu - 26 October 23

అన్నం వండి పెట్టలేదని ఓ యువకుడు తల్లిపై దారుణానికి పాల్పడ్డాడు. ఇంట్లో నుంచి తల్లిని బయటకు లాక్కొచ్చి మంటల్లో వేసి ఆమెను సజీవ దహనం చేశాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

అన్నం వండి పెట్టలేదని ఓ యువకుడు తల్లిపై దారుణానికి పాల్పడ్డాడు. ఇంట్లో నుంచి తల్లిని బయటకు లాక్కొచ్చి మంటల్లో వేసి ఆమెను సజీవ దహనం చేశాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

  • Author naresh1 Published - 05:45 PM, Thu - 26 October 23
దారుణం: అన్నం వండలేదని తల్లిని సజీవ దహనం చేసిన కుమారుడు!

తల్లి 9 నెలలు కడుపున మోసి బిడ్డకు జన్మనిస్తుంది. దీని వెనక ఆ తల్లి ఎంతో నరకాన్ని అనుభవిస్తుందనే చెప్పాలి. ఇక పెరిగి పెద్ద వాడైన కుమారుడు వృద్దాప్య సమయంలో మమ్మల్ని చూసుకుంటే చాలు అని ప్రతీ తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ, ఓ యువకుడు మాత్రం అన్నం వండి పెట్టలేదని దారుణానికి పాల్పడ్డాడు. ఇంట్లో నుంచి తల్లిని బయటకు లాక్కొచ్చి మంటల్లో వేసి ఆమెను సజీవ దహనం చేశాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్ర రాయ్ గడ్ జిల్లాలోని రెవ్ దందా పరిధిలోని నవ్ ఖర్ గ్రామంలో జయేష్ అనే కుమారుడు తల్లితో పాటు నివాసం ఉంటున్నాడు. అయితే ఇటీవల జయేష్ తన తల్లిని అన్నం వండి పెట్టాలని అడిగాడు. ఆరోగ్యం సహకరించకపోవడంతో దీనికి తల్లి నిరాకరించింది. ఇదే విషయంపై తల్లీ కొడుకు గొడవ పడ్డారు. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే పట్టరాని కోపంతో ఊగిపోయి జయేష్.. ఇంట్లో ఉన్న తల్లిని బయటకు లాక్కొచ్చాడు. అప్పటికే మండుతున్న మంటల్లో ఆ తల్లిని విసిరేశాడు. అందులో పడి ఆ మహిళ లబోదిబో మంటు మొత్తుకుంది.

వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆ మహిళను అందులో నుంచి బయటకు తీశారు. ఆ తర్వాత ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ, పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలుసుకుని జయేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం మృతురాలి ఇతర కుటుంబ సభ్యులు ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు ఆ దుర్మార్గుడిని పట్టుకున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలకంగా మారుతోంది. అన్నం వండి పెట్టలేదని తల్లిని సజీవ దహనం చేసిన కుమారుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి