iDreamPost
android-app
ios-app

వీడియో: వీడు అసలు.. మొగుడేనా! కట్టుకున్న భార్యను దారుణంగా!

  • Published Feb 28, 2024 | 9:40 PM Updated Updated Feb 28, 2024 | 9:40 PM

Indore Crime News: పరాయి మహిళ మోజులో కట్టుకున్న భార్యను చిత్రం హింసలకు గురి చేయడమే కాదు.. ఆమెను హత్య చేసే ప్రయత్నంలో పోలీసులకు దొరికిపోయాడు ఓ కసాయి భర్త

Indore Crime News: పరాయి మహిళ మోజులో కట్టుకున్న భార్యను చిత్రం హింసలకు గురి చేయడమే కాదు.. ఆమెను హత్య చేసే ప్రయత్నంలో పోలీసులకు దొరికిపోయాడు ఓ కసాయి భర్త

వీడియో: వీడు అసలు.. మొగుడేనా! కట్టుకున్న భార్యను దారుణంగా!

వేద మంత్రాల సాక్షిగా.. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంటను నూరేళ్ల పాటు కలిసి ఉండాలని బంధుమిత్రులు ఆశీర్వదిస్తారు. కానీ ఈ మధ్యకాలంలో పరిస్థితులు మారిపోయాయి.  పెళ్లైన సంవత్సరానికే భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం.. కోర్టులో విడాకులు తీసుకోవడం జరుగుతుంది. చాలా వరకు ఆర్థిక పరిస్థితులు, పని ఒత్తిడి, డామినేషన్, వివాహేతర సంబంధాల కారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి విడిపోతున్నారు. ఇదిలా ఉంటే అక్రమ సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకునే స్థాకియి వెళ్తున్నారు. భార్య బతికి ఉండగానే మరో మహిళను పెళ్లి చేసుకొని మొదటి భార్యను చంపే ప్రయత్నం చేశాడు ఓ దుర్మార్గపు భర్త. వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి తన భార్యను ఇటుకతో  కొట్టి, కత్తితో పొడిచిన దారుణంగా హింసించిన  వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.. జితేంద్ర పర్మార్, పూజా పర్మార్ భార్యాభర్తలు. భార్య బతికి ఉండగానే జితేంద్ర మరో మహిళలను మూడు నేలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. దీంతో మొదటి భార్య పూజాతో తరుచూ గొడవలు అవుతున్నాయి.గొడవలు పెద్ద మనుషల వద్దకు వెళ్లాయి. ఈ క్రమంలోనే పూజా తన ఇద్దరు పిల్లలను తీసుకొని నార్వార్ లో నివసిస్తుంది. గత ఆదివారం పూజా ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో జితేంద్ర ఇంట్లోకి వెళ్లి పూజా పర్మార్ తో గొడవ పెట్టుకున్నాడు. ఆ గొడవలో మాటా మాటా పెరిగి జితేంద్ర కత్తితో ఆమెను పొడిచాడు. ఆ సమయంలో జితేంద్ర తల్లితో పాటు రెండవ భార్య అతనికి సహకరించారు.

పూజాను కత్తితో పొడిచి.. జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటలూ బాల్కానీ పైకి తీసుకువచ్చాడు. అక్కడ ఆమెను ఇటుకతో తలపై కొట్టడం ప్రారంభించాడు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ దారుణ ఘటనను కొంతమంది వీడియో తీశారు. స్థానికులు స్పందించి ఆమెను రక్షించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పూజా ఐసీయూలో చికిత్స పొందుతుంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. పోలీసులు నిందితుడు జితేంద్ర పర్మార్ పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. అలాగే ఆయన తల్లి, రెండవ భార్య పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ దారుణ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

jojobet girişJOJOBET GİRİŞgamdomCasibomjojobetJojobet Giriş