iDreamPost
android-app
ios-app

Train: ఈ ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నారా? ఈ వార్త వింటే వణికిపోతారు?

  • Published Nov 11, 2024 | 12:22 PM Updated Updated Nov 11, 2024 | 12:23 PM

Train: రైలు ప్రయాణం అందరికీ అనుకూలమైనవి. కానీ అందరికీ కాదు. ఎక్కువ దూరం వెళ్లాలనుకునే ప్రజలకు అందుబాటు ధరలో మంచి ప్రయాణాన్ని అందించే మార్గం రైల్వే ప్రయాణం. కొన్ని రైళ్లలో ఊహించని పరిణామాలు జరుగుతాయి.

Train: రైలు ప్రయాణం అందరికీ అనుకూలమైనవి. కానీ అందరికీ కాదు. ఎక్కువ దూరం వెళ్లాలనుకునే ప్రజలకు అందుబాటు ధరలో మంచి ప్రయాణాన్ని అందించే మార్గం రైల్వే ప్రయాణం. కొన్ని రైళ్లలో ఊహించని పరిణామాలు జరుగుతాయి.

Train: ఈ ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నారా? ఈ వార్త వింటే వణికిపోతారు?

రైలు ప్రయాణాలు ప్రయాణికులకు చాలా అనుకూలమైనవి. ఎక్కువ దూరం వెళ్లాలనుకునే ప్రజలకు అందుబాటు ధరలో మంచి ప్రయాణాన్ని అందించే మార్గం రైల్వే ప్రయాణం. అందుకే పేద, మధ్య తరగతి ప్రజలు తమ ప్రయాణాలకు రైల్వే మార్గాన్నే ఇష్టపడతారు. అంతేగాక రైల్వే ప్రయాణంలో చక్కగా కిటికీ పక్కన కూర్చొని ఇయర్ ఫోన్స్ లో సాంగ్స్ వింటూ ప్రకృతి అందాలను తనివి తీరా ఆస్వాదించవచ్చు. అలాగే కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వారితో మన అనుభవాలు పంచుకోవచ్చు. చక్కగా మాట్లాడుకోవచ్చు. ఎలాంటి భయం లేని సురక్షితమైన ప్రయాణం. ఇవన్నీ కూడా సినిమాల్లో చాలా బాగా చూపిస్తారు.అఫ్ కోర్స్.. నిజ జీవితంలో కూడా రైల్వే ప్రయాణం బాగుంటుందిలే కానీ.. కొన్ని రైళ్లలో వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చెప్పే వార్త వింటే కొన్ని రైళ్లు కాదు బాబోయ్, అన్ని రైళ్లలో కూడా జాగ్రత్తగా ఉండాలి అంటారు. ఎందుకంటే ఈ వార్త విన్నారంటే కచ్చితంగా భయంతో వణికిపోవాల్సిందే.

కొన్ని రైళ్లలో ఊహించని పరిణామాలు జరుగుతాయి. రైలు మార్గంలో రక రకాల మనుషులు పరిచయం అవుతారు.కొన్ని రైలు మార్గాలలో అయితే దొంగలు రెచ్చిపోతున్నారు. అసలు రాత్రి, పగలు అనే తేడా లేకుండా రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. బీభత్సం సృష్టిస్తున్నారు. ప్రయాణికులను బెదిరించి నగలు, డబ్బులు కూడా దోచుకుపోతున్నారు. ఇలా పలుమార్లు రైళ్లలో చాలా దోపిడీలు జరిగాయి. ప్రయాణికులు ఫిర్యాదుల కూడా చేశారు. కానీ రికవరీలో మాత్రం రైల్వే అధికారులు కూడా ముందడుగు వేయలేకపోతున్నారు. రైళ్లలో జరిగే దొంగతనాలను అసలు నియంత్రించలేకపోతున్నారు. దొంగలు ఎప్పుడూ ఒకే రకంగా ఉంటారని అనుకోవడం చాలా పొరపాటు. దొంగల్లో కూడా మంచి దొంగలు ఉంటారు. మంచి దొంగలంటే మంచోళ్ళు కాదండోయ్. మంచిగా మాటలు చెప్పి మాయలో ముంచేసే వాళ్ళు. ఇలాంటి వాళ్ళు చాలా ప్రమాదకరం. తాజాగా ఇలాంటి వాళ్ళే వెలుగులోకి వచ్చారు. ఇంతకీ ఎలా దొంగతనం చేశారో తెలుసా? తెలిస్తే రైలు ప్రయాణాలు ఇక చేయరేమో.. చెన్నై నుంచి చీరాలకి పినాకిని ఎక్స్ ప్రెస్ వెళుతుంది. సరిగ్గా నెల్లూరు దాటాకా చోరీ జరిగింది. ఓ నడి వయసు మహిళ చెన్నై నుంచి పర్చూర్ కి తన బంధువుల ఇంటికి ఒంటరిగా వెళుతుంది. ట్రైన్ నెల్లూరు వచ్చాక ముగ్గురు యువకులు ట్రైన్ ఎక్కారు. ఆ మహిళ దగ్గరే కూర్చున్నారు. ఆ మహిళతో మాటలు కలిపారు. చాలా స్నేహంగా ఉన్నారు. కానీ ఆ మహిళకు మత్తు మందు ఇచ్చి దొంగతనానికి పాల్పడ్డారు. ముందుగా ఆమెకు మత్తు మందు కలిపిన జూస్ ఇచ్చారు. ఈ జూస్ తాగిన కొద్దిసేపటికే ఆ మహిళ మత్తులో జారుకుంది. దీంతో ఆమె వద్ద ఉన్న రూ. 10 లక్షల విలువైన బంగారు నగలను ఎత్తుకెళ్లారు.

కొద్ది సేపటకి ఆమెకు కొంచెం స్పృహ వచ్చింది. లేచి చూసే సరికి ఆమె ఒంటిపై బంగారు నగలు, బ్యాగ్ కనిపించలేదు. ఆ ముగ్గురు యువకులు కూడా కనిపించలేదు. దాంతో మహిళకు అసలు విషయం అర్ధమైంది. కానీ మత్తుమందు కారణంగా ఆమె ఆరోగ్యం బాగా క్షీణించడంతో తోటి ప్రయాణీకులు అతి కష్టంతో ఆమెను చీరాల స్టేషన్ లోని రైల్వే అధికారులకు అప్పగించారు. వారు ఆమెను హాస్పిటల్ లో చేర్పించారు. బాధితురాలి బంధువు వచ్చి చీరాల రైల్వే స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అతను తెలిపిన వివరాల ప్రకారం ఆ దొంగలు ఆమెకు బిస్కెట్స్, జ్యూస్ ఇస్తుంటే మొదట ఆమె తీసుకోలేదట. దాంతో ఆమె ముఖంపై వారు మత్తు మందు స్ప్రే చేశారని, ఆమె స్పృహ కొల్పవడంతో ఆమె మెడలోని బంగారు గొలుసు, బ్యాగ్ లో డబ్బు, నగలు దోచుకున్నారని ఆమె బంధువు చెప్పాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ రైలులో తరచూ దొంగతనాలు జరుగుతూ ఉంటాయని సమాచారం. అసలు విజయవాడ నుంచి చెన్నై వెళ్ళే మార్గమే చాలా డేంజర్ అని దొంగలు ఎక్కువగా ఉంటారని తెలిసింది. మార్గం ఏదైనా, ట్రైన్ ఏదైనా ఇలాంటి దొంగలు కచ్చితంగా ఉంటారు. కాబట్టి మనం ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదీ సంగతి. ఇక ఈ ఘటన గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahisJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişmadridbet güncel girişmadridbetholiganbet giriş