iDreamPost
android-app
ios-app

లాడ్జీలో హత్యకు గురైన వివాహిత! అసలేం జరిగిందంటే?

లాడ్జీలో హత్యకు గురైన వివాహిత! అసలేం జరిగిందంటే?

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ ఆర్థరాత్రి ఓ లాడ్జీలో హత్యకు గురైంది. శనివారం చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇంతకు ఈ మహిళను హత్య చేసింది ఎవరు? అసలు లాడ్జీకి ఆమె ఎవరితో వెళ్లింది? హత్యకు ముందు అసలేం జరిగిందంటే? పోలీసుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ పరిధిలోని చంద్రపేటలో రాములు-వెంకటవ్వ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 20 ఏళ్ల కిందట వివాహం జరిగింది. కొంత కాలానికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు.

అయితే వెంకటవ్వ స్థానికంగా ఉన్న ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించినట్లు తెలుస్తోంది. కాగా, వెంకటవ్వ శనివారం ఆమె ప్రియుడితో వేములవాడలోని ఓ లాడ్జీకి వెళ్లినట్లుగా సమాచారం. అదే రోజు అర్థరాత్రి ఆమె లాడ్జీలో హత్యకు గురైంది. ఇక ఆదివారం సాయంత్రం లాడ్జీ నిర్వాహకులు వీరి రూమ్ లోకి వెళ్లి చూడగా… వెంకటవ్వ శవమై కనిపించింది. ఈ సీన్ చూసిన ఆ లాడ్జీ నిర్వహకులు షాక్ గురయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ వివాహిత మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అనంతరం పోలీసులు ఆ లాడ్జీలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా.. ఆమె ఉన్న ఆ రూమ్ నుంచి శనివారం రాత్రి ఓ వ్యక్తి పారిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక అనుమానితుడిగా ఉన్న ఈ వ్యక్తి ఫొటోను పోలీసులు రిలీజ్ చేశారు. ఇక అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఇతడు వెంకటవ్వను హత్య చేసి ఆ లాడ్జీ నుంచి తప్పించుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.