iDreamPost
android-app
ios-app

పోలీస్‌ వికృత చర్య.. నర్సు స్నానం చేస్తుండగా వీడియో తీసి..

పోలీస్‌ వికృత చర్య.. నర్సు స్నానం చేస్తుండగా  వీడియో తీసి..

సమాజంలోని ప్రజల్ని సక్రమ మార్గంలో పెట్టాల్సిన పోలీసే నీఛానికి పాల్పడాడు. భార్య స్నేహితురాలిపై దారుణానికి ఒడిగట్టాడు. ఆమె స్నానం చేస్తుండగా వీడియోలు తీస్తూ వచ్చాడు. చివరకు పాపం పండి కేసులో ఇరుక్కుని అల్లాడుతున్నాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన ఓ మహిళ అక్కడి జిల్లా ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఆస్పత్రి బాత్‌ రూములో ఆమె స్నానం చేస్తూ పైకి చూసింది. అక్కడ ఓ సీసీ కెమెరా ఉండటం చూసి షాక్‌ అయింది. వెంటనే బయటకు రావటానికి ప్రయత్నించగా.. బయట తలుపు వేసి ఉంది.

దీంతో మరో మహిళను సాయం కోరింది. ఆమె తలుపు తీయగా నర్సు బయటకు వచ్చింది. ఆమెకు తన సహోద్యోగి భర్తపై అనుమానం వచ్చింది. అతడు పట్టణంలోనే కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. వెంటనే అతడి ఇంటికి వెళ్లింది. అతడ్ని ఈ విషయమై నిలదీసింది. ఫోన్‌ చూపించమని అడిగింది. అతడు ఫోన్‌ ఇ‍వ్వటానికి ఒప్పుకోలేదు. నర్సును పక్కకు తోసేసి పరారయ్యాడు. ఆమె సివిల్‌ లైన్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి అతడిపై ఫిర్యాదు చేసింది. కానిస్టేబుల్ వద్ద నుంచి ఫోన్ లాక్కుంటుండగా వీడియో డిలీట్ చేశాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. అతడి వద్దనుంచి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దాన్ని విచారణ నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. నేరం రుజువైతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి