iDreamPost
android-app
ios-app

స్పా సెంటర్‌ పేరుతో గలీజ్ పని! 9 మంది బాలికలతో..!

కొందరు కేటుగాళ్లు ఈజీ మనీ కోసం ఎంతటి దారుణాలకైన పాల్పడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి పెళ్లికాని అమ్మాయిలను, మహిళలను తీసుకొచ్చి గలీజ్ పనులకు తెర లేపుతున్నారు. ఇలాంటి ఘటనే తాాజాగా వెలుగు చూసింది.

కొందరు కేటుగాళ్లు ఈజీ మనీ కోసం ఎంతటి దారుణాలకైన పాల్పడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి పెళ్లికాని అమ్మాయిలను, మహిళలను తీసుకొచ్చి గలీజ్ పనులకు తెర లేపుతున్నారు. ఇలాంటి ఘటనే తాాజాగా వెలుగు చూసింది.

స్పా సెంటర్‌ పేరుతో గలీజ్ పని! 9 మంది బాలికలతో..!

ఈ రోజుల్లో కొందరు కేటుగాళ్లు ఈజీ మనీ కోసం ఎంతటి దారుణాలకైన పాల్పడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి పెళ్లికాని అమ్మాయిలను, మహిళలను తీసుకొచ్చి గలీజ్ పనులకు తెర లేపుతున్నారు. ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా రోజుకొక చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇలాంటివి అప్పుడప్పుడు హైదరాబాద్ లో చాలా చోట్ల జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ క్రమంలోనే ఇలాంటి ఘటనే తాజాగా మరొకటి వెలుగు చూసింది. ఏకంగా 9 మంది బాలికలను తీసుకొచ్చి పాడు పనులకు తెర లేపారు.

ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఆ స్పా సెంటర్ పై దాడులు నిర్వహించారు. ఇంతే కాకుండా మేనేజర్ ను అరెస్ట్ చేసి బాలికలను అరెస్ట్ చేశారు. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే? పోలీసుల కథనం ప్రకారం.. ముంబైలోని వెర్సోవా పరిధిలోని చార్ బంగ్లా ప్రాంతంలో కొందరు వ్యక్తులు రివైవల్ వెల్‌నెస్ పేరుతో ఓ స్పా సెంటర్ ను నడిపిస్తున్నారు. ఈ ముసుగులో నిర్వాహకులు ఎన్నో దారుణాలకు పాల్పడ్డారు. ఇతర ప్రాంతాల నుంచి పెళ్లికాని అమ్మాయిలు, మహిళలు, బాలికలను తీసుకొచ్చి వ్యభిచారాన్ని నడిపిస్తున్నారు.

అయితే ఈ పాడు పని చాలా కాలం నుంచి గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా, ఈ వ్యవహారాన్ని గమనించిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చాకచక్యంగా ఆ స్పా సెంటర్ పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏకంగా 9 మంది మైనర్ బాలికలను రక్షించి స్పా సెంటర్ మేనేజర్ ను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి