విషాదం: భార్య ఆత్మహత్య చేసుకున్న గంటకే భర్త బలవన్మరణం

క్షణికావేశంలో ఓ జంట గంట వ్యవధిలోనే బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలు తీసుకున్నారు. భార్య ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త వెంటనే స్థానికంగా ఉన్న రైల్వే ట్రాక్ పై బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే ఒక గంటలోనే ఈ భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోవడంతో ఇరువురి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గంట వ్యవధిలోనే ఈ దంపతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లాలోని మూసాయిపేటలో హేమలత (28)-మహేష్ (36) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గతంలో వివాహం జరిగింది. అయితే, పెళ్లైన కొంత కాలం పాటు వీరి సంసారం సాఫీగానే సాగింది. కానీ, రాను రాను ఈ భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు మొదలయ్యాయి. దీంతో తరుచు ఇద్దరు గొడవ పడుతూ ఉండేవారు. ఇక గురువారం కూడా ఈ దంపతులు మరోసారి గొడవ పడ్డట్లు తెలుస్తోంది. దీంతో ఓకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే క్షణికావేశంలో హేమలత ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ విషయం భర్త మహేష్ కు తెలియడంతో తట్టుకోలేకపోయాడు.

ఆ సమయంలో అతనికి ఏం చేయాలో తెలియక వెంటనే సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్నాడు. గంట వ్యవధిలో భార్యాభర్తలు బలవన్మరణానికి పాల్పడడంతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గంట వ్యవధిలో ఆత్మహత్యలు చేసుకున్నఈ దంపతుల నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: రైలులో కాల్పుల కేసు.. సంచలన నిజాలు వెల్లడించిన RPF కానిస్టేబుల్!

Show comments