iDreamPost
android-app
ios-app

నా స్నేహితుడితో పడుకో అంటూ భార్యను టార్చర్ పెట్టిన భర్త!

నా స్నేహితుడితో పడుకో అంటూ భార్యను టార్చర్ పెట్టిన భర్త!

పెళ్లైన తర్వాత అమ్మాయి కన్నవారిని, ఉన్న ఊరిని విడిచి తాళికట్టిన భర్తపై నమ్మకంతో అతడి వెంటే వెళ్తుంది. ఇక భర్త.. భార్య పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉంచితే చాలు. కానీ, ఈ రోజుల్లో మాత్రం కొందరు భర్తలు వివాహేతర సంబంధాలు ఏర్పరుచుకుని కట్టుకున్న భార్యను మోసం చేస్తున్నారు. అంతే కాకుండా తాళికట్టిన భార్యను పరాయి మగాళ్లతో పడుకోవాలంటూ టార్చర్ చేస్తున్న మగాళ్లు కూడా ఉననారు. అచ్చం ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది.

పోలీసుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్ లోని ముర్దాబాద్ కు చెందిన ఓ వ్యక్తి గ్వాలియర్ కు చెందని ఓ యువతిని గతంలో వివాహం చేసుకున్నాడు. పెళ్లైన కొంత కాలం పాటు భార్యతో బాగానే ఉన్నట్టు నటించాడు. రాను రాను ఇతగాడు మద్యానికి బానిసై దుర్మార్గుడిలా ప్రవర్తించాడు. పరాయి మహిళలతో అక్రమ సంబంధాలు ఏర్పరుచుకుని లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ వచ్చాడు. ఇక ఇంతటితో సరిపెట్టని ఈ వ్యక్తి.. ఏకంగా తన భార్యను అతని స్నేహితుల వద్ద పడుకోవాలంటూ టార్చర్ పెట్టాడు. గత కాలం నుంచి ఇదే విషయంపై భార్యను భర్త వేధింపులకు గురి చేస్తూనే ఉన్నాడు.

ఇదిలా ఉంటే.. ఇటీవల అతడు తన భార్యను స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడు. ఆమెకు బలవంతంగా మద్యం తాగించి తన స్నేహితులతో పడుకోవాలంటూ వేధించాడు. ఈ క్రమంలోనే అతడు తన భార్య ముందే అతని స్నేహితుల భార్యతో శృంగారం చేశాడు. భర్త బరితెగింపును ఆ మహిళ సహించలేకపోయింది. కొన్ని రోజుల తర్వాత భర్త దారుణంపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంచలనంగా మారింది. భార్యను పరాయి మగాళ్లతో పడుకోమని టార్చర్ పెట్టిన ఇతగాడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: RI స్వర్ణలత కేసు: విచారణలో సంచలన విషయాలు వెల్లడి!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి