iDreamPost
android-app
ios-app

మాదాపూర్ డ్రగ్స్ కేసు.. ఇంతకీ ఆ 18 మంది ఎవరు?

మాదాపూర్ డ్రగ్స్ కేసు.. ఇంతకీ ఆ 18 మంది ఎవరు?

మాదాపూర్ డ్రగ్స్ కేసు ఇప్పుడు టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించడమే కాకుండా సంచలనంగా మారుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన బాలాజీ, మరళి, వెంకట్ అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కేసు నమోదు చేసుకుని వారి వద్ద దొరికిన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసు తీగ లాగితే డొంక కదిలినట్లుగా మారిపోతుంది. ఈ నిందితులు మాదాపూర్ విఠల్ రావు నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో రూమ్ నెంబర్ 804ను అద్దెకు తీసుకున్నారు. ఇక ఇక్కడి నుంచే డ్రగ్స్ సరఫరా చేసినట్లు రుజువైంది. దీంతో పాటు కొంతమంది అమ్మాయిలు, మహిళలతో వ్యభిచారం కూడా నడిపినట్లు తేలింది.

ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారాన్నంతా బాలాజీ, వెంకట్ లు నడిపినట్లుగా పోలీసులు తెలిపారు. వీరిపై ఇది వరకే కేసులు కూడా నమోదైనట్లు కూడా సమాచారం. ఇకపోతే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వెంకట్ టాలీవుడ్ లో పలు చిత్రాలకు ఫైనాన్షియల్ గా కూడా వ్యవహరించాడట. ఈ నేపథ్యంలోనే ఇతడు టాలీవుడ్ లోని ఎవరైకైనా డ్రగ్స్ సరఫరా చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. మరో విషయం ఏంటంటే? వీళ్లు ముగ్గురు కలిసి దాదాపు 18 మందికి డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా నార్కెటిక్ పోలీసులు గుర్తించారు. ఇంతకు ఆ 18 ఎవరు? వాళ్లు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులా? లేక ఇంకెవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి