iDreamPost

ఆ విషయంలో పూజకు భర్తతో గొడవ.. ఇంట్లో ఎవ్వరూ లేని సమయం చూసి

పూజకు సునీల్ తో వివాహం అయ్యింది. ఇద్దరు కూడా ఎంబీఏ గ్రాడ్యుయేట్స్. రెండేళ్ల క్రితమే పెళ్లైంది. చూడ ముచ్చటైన జంట. పూజ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ ఉంటోంది. ఇంట్లో ఎవ్వరూ లేని సమయం చూసి

పూజకు సునీల్ తో వివాహం అయ్యింది. ఇద్దరు కూడా ఎంబీఏ గ్రాడ్యుయేట్స్. రెండేళ్ల క్రితమే పెళ్లైంది. చూడ ముచ్చటైన జంట. పూజ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ ఉంటోంది. ఇంట్లో ఎవ్వరూ లేని సమయం చూసి

ఆ విషయంలో పూజకు భర్తతో గొడవ.. ఇంట్లో ఎవ్వరూ లేని సమయం చూసి

ఆడ పిల్లలా పుట్టడడమే శాపం అనుకునే రోజుల నుండి వరంగా భావిస్తున్న రోజులు వచ్చాయి. మగవాళ్లకు ధీటుగా దేనిలోనైనా రాణించగలమని నిరూపిస్తున్నారు. అవనిలో సగం, ఆకాశంలో సగం అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కానీ ఇంటి గడపదాటకుండానే వేధింపులకు గురౌతున్నారు. ముఖ్యంగా పెళ్లైన మహిళలు.. భర్త, అత్తమామల ఆంక్షల నడుమ నలిగిపోతున్నారు. అంతేకాకుండా వారి ఆర్థిక అవసరాలకు ఆమెను ఓ ఏటీఎంగా వినియోగిస్తున్నారు. తన సంపాదనను లాక్కోవడమే కాకుండా, డబ్బు పిచ్చితో అవరసమైనప్పుడల్లా.. పుట్టింటికి వెళ్లి డబ్బులు తీసుకురా అంటూ వేధిస్తుంటారు. కాదంటే కన్నెర్ర చేస్తున్నారు. ఇంటి కోడల్ని నానా రకాలుగా హింసకు గురి చేస్తున్నారు.

భర్త ధన దాహానికి బలైందో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. వరకట్న వేధింపులతో విసిగిపోయిన ఓ టెకీ బలవంతంగా తనువు చాలించింది. ఈ ఘటన కర్ణాటకలోని విజయనగరం జిల్లా పులహడగలిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బసాపూర ప్రాంతానికి చెందిన సునీల్‌తో పూజకు రెండేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు ఎంబీఏ గ్రాడ్యుయేట్స్. పూజ ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా రాణిస్తుంది. ప్రస్తుతం వీరిద్దరూ గంగమ్మ గుడి సమీపంలో ఓ ఇంట్లో నివసిస్తున్నారు. సునీల్ కొంత కాలంగా మానసికంగా, శారీరకంగా ఆమెను వేధిస్తున్నాడు. పుట్టింటికి వెళ్లి డబ్బులు తీసుకురావాలంటూ హింసిస్తున్నాడు. అయితే అతడి హింసను భరించలేక ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో పూజ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

బయటకు వెళ్లిన భర్త ఇంటికి వచ్చి చూడగా ఉరికొయ్యకు వేలాడుతూ కనిపించింది. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించాడు సునీల్. అయితే మృతురాలి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అల్లుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భర్తతో విబేధాల కారణంగా తన కూతురు బలవన్మరణానికి పాల్పడిందని కంప్లయింట్‌లో పేర్కొన్నారు. పెళ్లైనా రెండేళ్లకే కూతుర్ని ఇలా అప్పగించాడంటూ కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఆమెను పుట్టింటి నుండి డబ్బులు తీసుకురావాలని హింసించడంతోనే ఆమె చనిపోయినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అల్లుడు సునీల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి