iDreamPost
android-app
ios-app

అందమైన భార్య.. ఆ పని చేస్తుందని తెలిసి.. భర్త మృగంలా మారిపోయాడు!

మమత చాాలా అందంగా ఉంటుంది. భర్త లోక్ నాథ్ కానిస్టేబుల్. బంగారం లాంటి పిల్లలు. బ్యూటీఫుల్ లైఫ్. అయితే భార్య సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు కార్యాలయానికి వచ్చింది. ఆమె రాకతో షాక్ తిన్నాడు భర్త.. అనంతరం

మమత చాాలా అందంగా ఉంటుంది. భర్త లోక్ నాథ్ కానిస్టేబుల్. బంగారం లాంటి పిల్లలు. బ్యూటీఫుల్ లైఫ్. అయితే భార్య సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు కార్యాలయానికి వచ్చింది. ఆమె రాకతో షాక్ తిన్నాడు భర్త.. అనంతరం

అందమైన భార్య.. ఆ పని చేస్తుందని తెలిసి.. భర్త మృగంలా మారిపోయాడు!

దంపతుల మధ్య గొడవలు సహజం. చిన్నచిన్న తగాదాలు పడుతూ.. అవసరమైతే మళ్లీ కలిసిపోతూ ఉంటారు. గిల్లికజ్జాలు కొన్ని బంధాన్ని బలోపేతం చేస్తాయి కానీ.. అస్తమాను పడే గొడవలు కాపురాన్ని కూల్చివేస్తుంటాయి. ముఖ్యంగా మనస్పర్థలు ఏర్పడితే.. వాటిని తీర్చడం ఎవరి వల్ల కాదు. ఇద్దరు కూర్చుని మాట్లాడే సమస్యలను కూడా పెద్దది చేసుకుని మన్సశాంతిని కోల్పోతుంటారు. చివరకు ఈ సంసారం రోడ్డున పడుతుంది. విడాకులు తీసుకుని ఎవరి బ్రతుకు వాళ్లు లీడ్ చేసే అవకాశం ఉన్నా.. పిల్లల కోసం కాంప్రమైజ్ అయ్యి బతుకుతుంటారు. ఇవి ఒక్కొక్కసారి దారుణమైన పరిస్థితులకు దారి తీసే అవకాశాలున్నాయి. కుటుంబంలో భర్తో, భార్యో ఒక్కరే పిల్లలకు మిగులుతున్నారు.

భార్య తనపై కేసు పెట్టేందుకు వచ్చిందని తెలుసుకున్న భర్త.. ఆమెను అదే ప్రాంగణంలో..పోలీసులు చూస్తుండగానే హత్య చేశాడు భర్త. ఈ ఘటన కర్ణాటకలోని హాసన్ జిల్లాలో చోటుచేసుకుంది. భార్యను హత్య చేసిన భర్త పరారీలో ఉన్నాడు. భర్త కానిస్టేబుల్ కావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. లోక్ నాథ్ హసన్ నగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో పోలీస్ కానిస్టేబుల్‌గా వర్క్ చేస్తున్నాడు. ప్రస్తుతం శాంతిగ్రామ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడికి 17 ఏళ్ల క్రితం మమతతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కొన్ని సంవత్సరాల నుండి భార్యా భర్తల మధ్య తగాదాలు మొదలయ్యాయి. తరచుగా గొడవ పడుతున్నారు. ఈ తగాదాలతో పిల్లలు కూడా సఫర్ అవుతున్నారు. నాలుగు రోజుల క్రితం కూడా లోక్ నాథ్, మమతల మధ్య గొడవ జరిగింది.

ఈ విషయంపై తాడో పేడో తేల్చుకోవాలని అనుకుంది భార్య. ఇక భర్తకు బుద్ధి రావాలంటే.. పోలీసులకు ఫిర్యాదు చేయడమో సరైనదని భావించింది. అదే పంతంతో హాసన్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు కార్యాలయానికి వచ్చింది. తన మీదే కేసు పెట్టేందుకు భార్య వెళుతుందని తెలుసుకున్న భర్త లోక్ నాథ్..కోపోద్రిక్తుడై.. అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచాడు. అతడిని అడ్డుకునేలోపు అక్కడి నుండి పరారయ్యాడు. ఇదంతా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ప్రాంగణంలోనే జరిగింది. వెంటనే మహిళను ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది మమత. పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుడు లోక్ నాథ్ కోసం గాలిస్తున్నారు పోలీసులు. లోక్ నాథ్‌ను త్వరలో పట్టుకుంటామని చెబుతున్నారు.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet GirişHoliganbetHoliganbet Giriş