iDreamPost
android-app
ios-app

విషాదం: 50 వేల మంది ఉన్న స్టేడియంలో తొక్కిసలాట.. 13 మంది మృతి

విషాదం: 50 వేల మంది ఉన్న స్టేడియంలో తొక్కిసలాట.. 13 మంది మృతి

50 వేల మంది ఉన్న ఓ స్టేడియంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో దాదాపు 13 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే? మడగాస్కర్ రాజధాని అంటనానారివోలోని బరియా స్టేడియంతో తాజాగా ఇండియన్ ఓషన్ ఐలాండ్ గేమ్స్ ప్రారంభోత్సవం జరిగింది. ఇది చూడటానికి బరియా స్టేడియానికి దాదాపు 50 వేల మంది హాజరయ్యారు. అయితే అందరూ ఒకేసారి స్టేడియం లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ తోపులాట జరిగింది.

ఇదే సమయంలో తొక్కిసలాటకు దారి తీయడంతో స్టేడియంలో అరుపులు వినిపించాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు పిల్లలతో సహా 13 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఇదే కాకుండా 107 మందికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ స్టేడియానికి చేరుకుని గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక వీరి మరణవార్త తెలుసుకుని మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు నగర వ్యాప్తంగా తీవ్ర విషాదంగా మారింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు పలువురిని కంటతడి పెట్టిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: వన్డేల్లో ప్రపంచ నంబర్‌ వన్‌గా పాకిస్థాన్‌! మరి భారత్‌?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి