iDreamPost
android-app
ios-app

కేంద్రం అదిరే ఆఫర్‌ ఈ ఒక్క పని చేస్తే చాలు.. అకౌంట్‌లోకి ఉచితంగా రూ.50 వేలు

  • Published Jun 11, 2024 | 4:12 PM Updated Updated Jun 11, 2024 | 4:12 PM

కేంద్రం ఓ బంపరాఫర్‌ ప్రకటించింది. ఇంటి నుంచి కాలు బయటపెట్టకుండా.. రూపాయి ఖర్చు చేయకుండా ఏకంగా 50 వేల రూపాయలు పొందే అవకాశం కల్పిస్తోంది. ఆ వివరాలు..

కేంద్రం ఓ బంపరాఫర్‌ ప్రకటించింది. ఇంటి నుంచి కాలు బయటపెట్టకుండా.. రూపాయి ఖర్చు చేయకుండా ఏకంగా 50 వేల రూపాయలు పొందే అవకాశం కల్పిస్తోంది. ఆ వివరాలు..

  • Published Jun 11, 2024 | 4:12 PMUpdated Jun 11, 2024 | 4:12 PM
కేంద్రం అదిరే ఆఫర్‌ ఈ ఒక్క పని చేస్తే చాలు.. అకౌంట్‌లోకి ఉచితంగా రూ.50 వేలు

కేంద్ర ప్రభుత్వం సామాన్యుల కోసం అనేక రకాల పథకాలతో పాటు అప్పుడప్పుడు కొన్ని పోటీలు కూడా నిర్వహిస్తుంటుంది. వీటి ద్వారా.. లబ్ధిదారులు, విజేతలకు భారీ మొత్తంలో ప్రైజ్‌ మనీ ఇస్తూ.. వారిని ప్రోత్సాహిస్తుంది. అలానే తాజాగా కేంద్రం ఓ బంపరాఫర్‌ ప్రకటించింది. మీరు ఇల్లు కదలకుండా.. జేబు నుంచి రూపాయి ఖర్చు చేయాల్సిన పని లేకుండా.. భారీ మొత్తంలో డబ్బులు పొందవచ్చు. ఇందు కోసం మీరు ఓ చిన్న పని చేయాలి. అలా చేస్తే.. కేంద్ర ప్రభుత్వం మీకు 50 వేల రూపాయలు ఇవ్వనుంది. ఇవి నేరుగా మీ ఖాతాలో పడతాయి. మరి ఈ మొత్తం పొందాలంటే.. ఏం చేయాలి.. అసలు కేంద్రం ఎందుకు ఇంత భారీ మొత్తంలో నగదు ఇస్తుంది అనేది తెలియాలంటే.. ఇది చదవండి.

మరి 50 వేల రూపాయల నగదు పొందాలంటే మీరు ఏం చేయాలంటే.. కేంద్ర ప్రభుత్వ నిర్వహిస్తోన్న ఓ పోటీలో పాల్గొని మీ ప్రతిభ చూపాలి. దీనిలో గెలిస్తే.. మీ ఖాతాలో 50 వేల రూపాయలు జమ చేస్తారు. ఇంతకు ఈ పోటీ దేని గురించి అంటే.. లఖ్‌పతి దీదీ స్కీమ్‌ లోడో డిజైన్ కోసం. కేంద్రం ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థిక స్వాలంభన కలిగించి.. వారిని లక్షాధికారులు చేయాలనే ఉద్దేశంతో ఈ లఖ్‌పతి దీదీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే నేటికి కూడా చాలా మందికి ఈ పథకం గురించి తెలియదు. ఈ స్కీమ్‌ గురించి అవగాహన కల్పించడం కోసం కేంద్రం లోగో డిజైన్‌ పోటీని నిర్వహిస్తోంది. ఇక ఈ పోటీలో పాల్గొని.. గెలుపొందిన వారికి వారికి రూ. 50 వేలు లభిస్తాయి. అంటే మీరు ఇంట్లో కూర్చునే ఈ మొత్తాన్ని పొందొచ్చు.

లోగో విషయానికి వస్తే.. మీరు డిజైన్‌ చేసే లోగో.. స్వయం ఉపాధి సంఘాలకు చెందిన మహిళల సాధికారతను సూచించేలా ఉండాలి. స్వయం సహాయక సంఘాల లక్ష్యం లక్షాధికారులు అవ్వడమే అనే అంశాన్ని తెలియజేసేలా లోగో ఉండాలి. ఇలా ఈ అంశాలు పరిగణలో ఉంచుకొని లోగోను డిజైన్ చేయాల్సి ఉంటుంది. మీకు ఈ పోటీ మీద ఆసక్తి ఉంటే.. మైగౌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీరు ఈ కాంటెస్ట్‌లో పాల్గొనవచ్చు. ఈ కాంటెస్ట్ జూన్ 10న ప్రారంభం అయ్యింది. ఈ నెల చివరి వరకు అందుబాటులో ఉండనుంది.

మరి మీకు ఆసక్తి ఉంటే వెంటనే అప్లై చేయండి. మంచి లోగో డిజైన్ చేసి.. సబ్‌మిట్ చేస్తే సరిపోతుంది. ఇక ఈ పోటీలో భారతీయ పౌరులు ఎవరైనా పాల్గొనవచ్చు. అయితే మైగౌ, రూరల్ డెవలప్‌మెంట్ శాఖ ఉద్యోగులకు మాత్రం ఈ పోటీలో పాల్గొనే అవకాశం లేదు. పోటీలో పాల్గొనే వ్యక్తి.. ఒక్కసారి మాత్రమే లోగో డిజైన్ చేసి పంపాల్సి ఉంటుంది. దీనిలో విజేతగా నిలిచిన వ్యక్తికి సెంట్రల్‌ రూరల్ డెవలప్‌మెంట్ శాఖ ప్రైజ్‌ మనీగా 50 వేల రూపాయలు ఇస్తుంది.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş