iDreamPost
android-app
ios-app

ఎయిర్ టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. 28 రోజులు కాదు నెలకు పైగా వ్యాలిడిటీ

  • Published Apr 14, 2024 | 1:22 PM Updated Updated Apr 14, 2024 | 1:22 PM

దేశంలో అతి పెద్ద టెలికాం సంస్థలో ఒకటైన ఎయిర్ టెల్ ఎప్పటికప్పుడు సరికొత్త రీఛార్జ్ ప్లాన్లను పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఎయిర్ టెల్ నెలవారీ తక్కువ వ్యాలిటీతో కూడిన సరికొత్త ప్లాన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. మరి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

దేశంలో అతి పెద్ద టెలికాం సంస్థలో ఒకటైన ఎయిర్ టెల్ ఎప్పటికప్పుడు సరికొత్త రీఛార్జ్ ప్లాన్లను పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఎయిర్ టెల్ నెలవారీ తక్కువ వ్యాలిటీతో కూడిన సరికొత్త ప్లాన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. మరి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Apr 14, 2024 | 1:22 PMUpdated Apr 14, 2024 | 1:22 PM
ఎయిర్ టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. 28 రోజులు కాదు నెలకు పైగా వ్యాలిడిటీ

ప్రస్తుతం ఎక్కడ చూసిన మొబైల్ ఫోన్ వాడకం అనేది క్రమేపి పెరిగిపోయింది.దీంతో ప్రతిఒక్కరి చేతుల్లో ఫోన్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఇక వీటిని వినియోగించడమే కాకుండా.. అనేక రకాల బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ కూడా చేయించుకుంటారు. ఈ క్రమంలోనే వివిధ టెలికాం సంస్థలు కూడా తమ కస్టమర్లను ఆకర్షించేందుకు రకరకాల ఆఫర్స్ ను ప్రకటిస్తుంటారు. కాగా, దేశంలోని ప్రముఖ టెలికాం ప్రొవైడర్ సంస్థల్లో ఎయిర్ టెల్ కూడా ఒకటి. ఇక ఈ ఎయిర్ టెల్ టెలికాం సంస్థ అనేది తమ వినియోగాదారులకు కోసం ఎప్పుడు కరకరకాల అన్ లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఎయిర్ టెల్ నెలవారీ తక్కువ వ్యాలిటీతో కూడిన సరికొత్త ప్లాన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

దేశంలో అతి పెద్ద టెలికాం సంస్థలో ఒకటైన ఎయిర్ టెల్ ఎప్పటికప్పుడు సరికొత్త రీఛార్జ్ ప్లాన్లను పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, సాధారణంగా నెలవారీ రీఛార్జ్ లకు సంబంధించి కొన్ని టెలికాం కంపెనీలు కేవలం 28 రోజులు వ్యాలిడిటీని మాత్రమే అందిస్తుంటాయి. ఈ క్రమంలోనే అతి తక్కువ వ్యాలిడిటీతో చాలామంది కస్టమర్లు ఇబ్బందిపడుతు ఉంటారు. అలాంటి వారి కోసం ఎయిర్ టెల్ ఇప్పుడు 35 రోజుల వ్యాలిడిటీ కలిగిన సరి కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా, ఈ రీఛార్జ్ ప్లాన్‌లలో తక్కువ వ్యాలిడిటీ పీరియడ్‌ల సమస్యకు ప్రతిస్పందనగా.. ఎయిర్‌టెల్‌ నుంచి ఇప్పుడు తాజా ఆఫర్ వచ్చింది.

ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రతి 28 రోజులకు ఒకసారి రీఛార్జ్ చేసుకోవడం వల్ల చాలా మంది వినియోగదారులు తరచుగా అసౌకర్యానికి గురవుతుంటారు. ఈ సమస్యలను గుర్తించి వాటిపై దృష్టి సారించిన  ఎయిర్‌టెల్‌.. కేవలం రూ. 289 ధరతో  35 రోజుల పాటు ఎక్స్‌టెండెడ్‌ వ్యాలిడిటీని అందించే కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఇక ఎయిర్ టెల్ ఈ కొత్త ప్లాన్ ప్రయోజనాలు ఏమిటంటే.. రూ. 289తో రీఛార్జ్ ప్లాన్ తో పాటు అధిక వ్యాలిడిటీని అందించడమే కాకుండా.. వినియోగదారులకు అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అలాగే చెల్లుబాటు వ్యవధిలో అపరిమిత కాలింగ్‌తో పాటు, రోజుకు 300 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు చేసుకోవచ్చు.  ఇక అధిక డేటా అవసరాలు ఉన్న వినియోగదారులకు ఇది సరైన ఆఫర్ కాకపోవచ్చు. ఎందుకంటే.. దీనిలో మొత్తం చెల్లుబాటు వ్యవధికి 4GB డేటా మాత్రమే ఈ ప్లాన్‌పై లభిస్తుంది.  మరి, కేవలం 28 రోజులు వ్యాలిడిటీ అసౌకర్యంకు గురవుతున్న వినియోగదారులకు ఎయిర్ టెల్ అందించే బెస్ట్ ఆఫర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahiscasibomjojobet girişcasibomJojobet Giriş