iDreamPost
android-app
ios-app

విద్యార్థులకు రూ.10 లక్షలు ఇచ్చే ఈ గవర్నమెంట్‌ స్కీమ్‌ గురించి మీకు తెలుసా!

  • Published Aug 05, 2023 | 7:05 PM Updated Updated Aug 05, 2023 | 7:08 PM
  • Published Aug 05, 2023 | 7:05 PMUpdated Aug 05, 2023 | 7:08 PM
విద్యార్థులకు రూ.10 లక్షలు ఇచ్చే ఈ గవర్నమెంట్‌ స్కీమ్‌ గురించి మీకు తెలుసా!

దేశంలో విద్యను ప్రోత్సాహించడంతో పాటు ప్రతిభావంతులైన విద్యార్థులను ఆదుకునేందుకు.. వారిని మరింత ప్రోత్సాహించేందుకు ప్రభుత్వాలు అనేక రకాల పథకాలు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే కేవలం దేశీయంగా మాత్రమే కాక విదేశాల్లో జరిగే పలు పోటీల్లో మన విద్యార్థులు పాల్గొని.. తమ ప్రతిభను నిరూపించుకునేందుకు కూడా ప్రభుత్వం సాయం చేస్తోంది. మన దేశంలో ఇంజనీరింగ్‌ చదివే విద్యార్థులు.. విదేశాల్లో నిర్వహించే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి గాను.. వారికి ఆర్థిక సాయం అందజేసేందుకు ఓ పథకాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీని ద్వారా అర్హులైన విద్యార్థి ఒక్కక్కిరికి లక్ష చొప్పున ఒక టీమ్‌లోని పది మందికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తోంది కేంద్ర ప్రభుత్వం.

ఈ మొత్తాన్ని విద్యార్థులు వారి విమాన, రైలు ప్రయాణ టికెట్లు, బస, భోజనం, రిజిస్ట్రేషన్‌, వీసా ఫీజులకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పోటీల్లో పాల్గొని తిరిగి వచ్చాక.. ఖర్చుకు సంబంధించిన లెక్కలు సమర్పించాల్సి ఉంటుంది.

స్కీమ్‌ ప్రధాన ఉద్దేశం ఏంటంటే..

దేశంలో బీఈ, బీటెక్‌ లేదా ఇంటిగ్రేటెడ్‌ ఎం టెక్‌, ఎంఈ ఫస్టియర్‌, సెకండియర్‌ చ‌దువుతున్న విద్యార్థులు.. విదేశాల్లో జ‌రిగే అంత‌ర్జాతీయ పోటీల్లో పాల్గొన‌డానికి గాను వారికి ఆర్థిక సాయం అందించేందుకు వీలుగా ఈ పథకాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని అఖిల భార‌త సాంకేతిక విద్యా మండ‌లి (ఏఐసీటీఈ) ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోంది. విద్యార్థుల‌కు అంత‌ర్జాతీయ సైన్స్ పోటీల‌కు సంబంధించి ఆహ్వానం ఉన్న‌ట్ల‌యితే.. అవి జాతీయ స్థాయి, అంత‌ర్జాతీయ స్థాయి పోటీలుగా గుర్తింపు పొందిన‌వి అయితే.. అలాంటి పోటీల్లో విద్యార్థులు పాల్గొన‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం అలానే ఏఐసీటీఈ వారికి ఆర్థిక స‌హాయం అంద‌జేస్తాయి.

ఎవరు అర్హులంటే..

ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ఇంజనీరింగ్‌ కాలేజీల్లో బీఈ, బీటెక్‌, ఇంటిగ్రేటెడ్‌ ఎంబీ, ఎంటెక్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ చదువుతోన్న విద్యార్థులందరూ ఈ పథకానికి అర్హులే. అయితే పోటీలకు వెళ్లే విద్యార్థుల బృందంలో కనీసం 10 మందికి తగ్గకుండా ఉండాలి.

ఎలా అప్లై చేసుకోవాలంటే..

  • విద్యార్థులు మొదట ఈ వెబ్ లింకు ద్వారా ఏఐసీటీఈ వెబ్‌సైటులోకి వెళ్లి అక్క‌డ విద్యార్థుల‌కు అందిస్తున్న ప‌థ‌కాల విండోకి వెళ్లాలి.
  • అందులో ‘Support to Students for Participating in Competition Abroad Scheme అనే ఆప్షన్‌ మీద క్లిక్ చేసి ద‌ర‌ఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • అప్లికేషన్‌ ఫామ్‌ పూర్తి చేసిన మీరు పోటీలో పాల్గొనాల‌ని మీకు లేదా మీ బృందానికి అందిన అంత‌ర్జాతీయ కాంపిటీష‌న్ ఇన్విటేష‌న్ ప‌త్రం అటాచ్‌ చేయాలి.
  • ఇందులో మీరు ఫిల్‌ చేసే ప్ర‌తి స‌మాచారం కూడా చాలా కరెక్ట్‌గా ఉండాలి. తప్పుడు సమాచారం ఇవ్వకూడదు.
  • అంతేకాక మీరు పాల్గొనబోయే పోటీలకు సంబంధించి మీరు ఇవ్వనున్న ప్ర‌జెంటేష‌న్, ఆ పోటీకి సంబంధించి పూర్తి వివ‌రాల‌తో కూడిన ప్ర‌త్యేక డాక్యుమెంట్‌ సమర్పించాలి.

Jojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Giriş