iDreamPost
android-app
ios-app

భక్తులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ

భక్తులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ

ఇటీవల తిరుమల నడక మార్గంలో చిరుత దాడిలో ఓ చిన్నారి మరణించిన విషయం తెలిసిందే. దీంతో టీటీడీ అప్రమత్తమై భక్తులను రక్షించేందుకు కర్రలు పంపిణి చేసిన విషయం తెలిసిందే. ఇదే కాకుండా నడక మార్గంలో ఇనుప కంచెను సైతం ఏర్పాటుకు టీటీడీ ముందుకు వచ్చింది. దీంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే భక్తులకు టీటీడీ తాజాగా మరో శుభవార్తను చెప్పింది. అదేంటంటే? డిసెంబర్ 1 నుంచి 22 వరకు రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లను అందుబాటులకు తీసుకురానుంది.

ఈ టికెట్లను ఈ నెల 25 నుంచి ఉదయం 10 గంటలకు విడుదల చేయనుందని అధికారులు తెలిపారు. ఇంతే కాకుండా సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోటా టికెట్లను శనివారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు లక్షలాదిగా తరలివచ్చి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఈ రోజు సాయంత్రం స్వర్ణరథం, రాత్రి గజ వాహన సేవలు జరగనున్నాయి అధికారులు తెలిపారు.

Jojobet GirişMadridbetMariobetcasibommeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet giriş