iDreamPost

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలోనే రెండో పీఆర్సీ!

  • Author singhj Published - 03:24 PM, Fri - 21 July 23
  • Author singhj Published - 03:24 PM, Fri - 21 July 23
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలోనే రెండో పీఆర్సీ!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అన్ని పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగుతూ పొలిటికల్​ హీట్​ను పెంచుతున్నాయి. అదే సమయంలో అధికారంలోకి వచ్చేందుకు ఎత్తుగడలు, వ్యూహాలు రచిస్తూ బిజీ అయిపోతున్నాయి. అన్ని వర్గాల ప్రజల్ని టార్గెట్ చేస్తూ వాళ్ల ఓట్లను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ కూడా ఆ దిశగా దృష్టి సారిస్తోంది. ఎలక్షన్స్ సమీపిస్తున్న తరుణంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్​లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ సర్కారు భావిస్తోంది. ఇందులో భాగంగా ఎంప్లాయీస్ నుంచి ఇటీవల వచ్చిన డిమాండ్లకు అనుగుణంగా వేతన సవరణ చేయడం కోసం కమిషన్​ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అదే సమయంలో ఇంట్రిం రిలీఫ్ (ఐఆర్​)ను కూడా సర్కారు ప్రకటించనుందని తెలుస్తోంది. ఈ మేరకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కావాలని అనుకుంటున్నట్లు సచివాలయ వర్గాల సమాచారం. తెలంగాణ నూతన రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఫస్ట్ పీఆర్సీని 2018 జులైలో ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ గడువు ఈ సంవత్సరం జూన్​ ఆఖరుతో ముగిసింది. దీంతో నూతన పీఆర్సీ జులై 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది.

గత పీఆర్సీ కమిషన్ గడువు ముగియడంతో నూతన కమిషన్​ను ఏర్పాటు చేయాలని కేసీఆర్ సర్కారు భావిస్తోంది. ఈ నెలాఖరులోగా ఎంప్లాయీస్ యూనియన్ల ప్రతినిధులతో మాట్లాడి అవసరాన్ని బట్టి ఆ తర్వాత ఐఆర్ పైనా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకమైన ఈహెచ్​ఎస్ పై కూడా నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఈహెచ్ఎస్ అమలుకు విధివిధాలను రూపొందించనుందని సమాచారం. దీంతో పాటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ హౌజింగ్​ మీద కూడా సర్కారు కీలక ప్రకటన చేయనుందని తెలిసింది. ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్ సమావేశం తర్వాత ఈ విషయాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి