iDreamPost

మొదటిసారి తండ్రైన టీమిండియా పేస్ బౌలర్.. సోషల్ మీడియాలో అభినందనల వెల్లువ

భారత పేస్ బౌలర్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు వైరల్ గా మారింది. ఆ పోస్టు చేసింది ఎవరంటే భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ. తాను తండ్రైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. దీంతో అతడిపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

భారత పేస్ బౌలర్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు వైరల్ గా మారింది. ఆ పోస్టు చేసింది ఎవరంటే భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ. తాను తండ్రైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. దీంతో అతడిపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

మొదటిసారి తండ్రైన టీమిండియా పేస్ బౌలర్.. సోషల్ మీడియాలో అభినందనల వెల్లువ

మన దేశంలో క్రికెటర్లకు ఉండే ఫాలోయింగ్ వేరే లేవల్. ఆటగాళ్లను తమ దేవుళ్లుగా భావిస్తుంటారు వారి ఫ్యాన్స్. క్రికెట్ ప్రియులు క్రికెటర్ల పట్ల అమితమైన ప్రేమను కనబర్చుతారు. సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది టీమిండియా క్రికెటర్లకు. ఈ కారణం చేత ఆటగాళ్లకు సంబంధించిన విషయం ఏదైనా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారుతుంటుంది. ఈ క్రమంలో భారత పేస్ బౌలర్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు వైరల్ గా మారింది. ఆ పోస్టు చేసింది ఎవరంటే భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ. తాను తండ్రైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. దీంతో అతడిపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

టీమిండియా క్రికెటర్ సీనియ‌ర్‌ ఫాస్ట్ బౌల‌ర్ ఇషాంత్ శ‌ర్మ తండ్రి అయ్యాడు. అత‌డి భార్య ప్ర‌తిమా సింగ్ పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. మొదటిసారి తల్లిదండ్రులయ్యారు వీరిద్దరు. ఈ సంతోషకరమైన విషయాన్ని ఇషాంత్ సోషల్‌మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నాడు. దీంతో సినీ, క్రికెట్ రంగాలకు చెందిన ప్రముఖులు ఇషాంత్ దంప‌తుల‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. కాగా ఇషాంత్ శర్మ బాస్కెట్ బాల్ క్రీడాకారిణి ప్ర‌తిమ‌ను 2016లో వివాహం చేసుకున్నాడు. ఇషాంత్.. టీమిండియా త‌ర‌ఫున 105 టెస్టులు, 80 వ‌న్డేలు, 14 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్ల‌లో కలిపి 434 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి