iDreamPost
android-app
ios-app

వీడియో: పరువు తీసుకున్న రాయుడు.. బిల్డప్ ఇచ్చి తుస్సుమన్నాడు!

  • Published Jun 22, 2024 | 8:09 PM Updated Updated Jun 22, 2024 | 8:09 PM

టీమిండియా మాజీ బ్యాటర్ అంబటి రాయుడు తన పరువు తానే తీసుకున్నాడు. అనవసర బిల్డప్ ఇచ్చి తుస్సుమన్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

టీమిండియా మాజీ బ్యాటర్ అంబటి రాయుడు తన పరువు తానే తీసుకున్నాడు. అనవసర బిల్డప్ ఇచ్చి తుస్సుమన్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

  • Published Jun 22, 2024 | 8:09 PMUpdated Jun 22, 2024 | 8:09 PM
వీడియో: పరువు తీసుకున్న రాయుడు.. బిల్డప్ ఇచ్చి తుస్సుమన్నాడు!

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఎప్పుడూ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. రిటైర్మెంట్ తర్వాత కూడా క్రికెట్​లో అతడు యాక్టివ్​గా ఉంటున్నాడు. కామెంట్రీ చేస్తూ ఆడియెన్స్​ను ఎంటర్​టైన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే ఈ క్రమంలో అతడు చేస్తున్న కొన్ని చేష్టలు వైరల్​ అవుతున్నాయి. ఐపీఎల్-2024 సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్​తో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి అతడు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. నాకౌట్ ఫైట్​లో ఆర్సీబీ చేతుల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడటాన్ని జీర్ణించుకోలేకపోయాడు రాయుడు. దీంతో బెంగళూరు ఈసారి కప్పు కొట్టాలని.. ఒకవేళ టైటిల్ రాకపోతే సీఎస్​కే దగ్గర ఉన్న కప్పుల్లో నుంచి ఒకదాన్ని ఇచ్చేస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్​ టైమ్​లో రాయుడు వ్యాఖ్యలతో అతడిపై ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు. నెట్టింట అతడి మీద ట్రోలింగ్ నడిచింది. ఈ కాంట్రవర్సీ ఎలాగోలా సమసిపోయింది. అయితే తాజాగా రాయుడుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీ20 వరల్డ్ కప్-2024లో కామెంటేటర్​గా వ్యవహరిస్తున్న రాయుడు తన పరువు తానే పోగొట్టుకున్నాడు. భారత స్పీడ్​స్టర్ మహ్మద్ సిరాజ్​తో కలసి బౌండరీ లైన్ దగ్గర కాసేపు గడిపాడు రాయుడు. అయితే ఆ సమయంలో సరదాగా ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేశాడతను. క్యాచ్​లు పట్టేందుకు ప్రయత్నించి అతడు విఫలమయ్యాడు. ఓ క్యాచ్ పట్టబోయి బౌండరీ రోప్ దాటి కిందపడ్డాడు. రాయుడు క్యాచ్​ పడతాడని అనుకున్న సిరాజ్.. అనూహ్యంగా కిందపడటంతో నవ్వాపుకోలేకపోయాడు.

రాయుడు కింద పడగానే సిరాజ్ నవ్వుల్లో మునిగిపోయాడు. లేచిన వెంటనే అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. రాయుడు తప్పుగా అనుకుంటాడని కూడా భావించకుండా సిరాజ్ నవ్వుతూనే ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ రెగ్యులర్​గా క్రికెట్ ఆడట్లేదు కాబట్టి ఇలా జరిగిందని అంటున్నారు. అయితే మరికొందరు నెటిజన్స్ మాత్రం బిల్డప్ ఇచ్చి పరువు పోగొట్టుకోవడం అవసరమా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. వరల్డ్ కప్​లో అదరగొడుతున్న టీమిండియాను రాయుడు మెచ్చుకున్నాడు. మెగాటోర్నీలో జట్టు ఆడుతున్న తీరు అద్భుతమని ప్రశంసించాడు. సూర్యకుమార్ యాదవ్, జస్​ప్రీత్ బుమ్రా ఆటతీరు అద్భుతమన్నాడు. బుమ్రా భారత టీమ్​కు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పాడు. అతడు జట్టులో ఉండటం మనందరి అదృష్టమని పేర్కొన్నాడు. రాయుడు క్యాచ్ మిస్ ఘటనపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by vrushbh 🔵 (@vrushbh_army00)