iDreamPost

ఆఫ్ఘాన్​​పై గెలుపుతో జోష్​లో ఉన్న భారత్​కు బ్యాడ్ న్యూస్.. ఇదేం కర్మరా బాబు!

  • Published Jun 21, 2024 | 9:54 PMUpdated Jun 21, 2024 | 9:54 PM

ఆఫ్ఘానిస్థాన్​పై గెలుపుతో జోష్​లో ఉంది టీమిండియా. నెక్స్ట్ మ్యాచ్​లో బంగ్లాదేశ్​ను చిత్తు చేయాలని చూస్తోంది. ఈ తరుణంలో భారత జట్టుకు బ్యాడ్ న్యూస్.

ఆఫ్ఘానిస్థాన్​పై గెలుపుతో జోష్​లో ఉంది టీమిండియా. నెక్స్ట్ మ్యాచ్​లో బంగ్లాదేశ్​ను చిత్తు చేయాలని చూస్తోంది. ఈ తరుణంలో భారత జట్టుకు బ్యాడ్ న్యూస్.

  • Published Jun 21, 2024 | 9:54 PMUpdated Jun 21, 2024 | 9:54 PM
ఆఫ్ఘాన్​​పై గెలుపుతో జోష్​లో ఉన్న భారత్​కు బ్యాడ్ న్యూస్.. ఇదేం కర్మరా బాబు!

టీ20 వరల్డ్ కప్​లో భారత్​ హవా నడుస్తోంది. ఇప్పటిదాకా ఓటమి అనేదే లేకుండా బ్రేకుల్లేని బుల్డోజర్​లా దూసుకెళ్తోంది టీమిండియా. లీగ్ స్టేజ్​లో హ్యాట్రిక్ విక్టరీస్ కొట్టిన రోహిత్ సేన.. సూపర్-8ను కూడా సక్సెస్​ఫుల్​గా స్టార్ట్ చేసింది. ఆఫ్ఘానిస్థాన్​తో జరిగిన సూపర్ పోరులో 47 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపించింది. కరీబియన్ పిచెస్​పై ఎలా ఆడుతుందో అనే అనుమానాల మధ్య బరిలోకి దిగిన భారత్.. ఆల్​రౌండ్ పెర్ఫార్మెన్స్​తో దుమ్మురేపింది. సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 53), హార్దిక్ పాండ్యా (24 బంతుల్లో 32), విరాట్ కోహ్లీ (24) బ్యాట్లతో చెలరేగారు. ఆ తర్వాత జస్​ప్రీత్ బుమ్రా, అర్ష్​దీప్ సింగ్ చెరో 3 వికెట్లతో ప్రత్యర్థి నడ్డి విరిచారు.

భారత బౌలర్లతో పాటు బ్యాటర్లు కూడా ఫామ్​లోకి రావడం, డేంజరస్ టీమ్​ను చిత్తుగా ఓడించడంతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ఇలా ఆడితే ఏ టీమ్ కూడా మనల్ని ఆపలేదని, కప్ టీమిండియాదేనని ఫ్యాన్స్ అంటున్నారు. తదుపరి మ్యాచుల్లో బంగ్లాదేశ్​, ఆస్ట్రేలియాను కూడా రోహిత్ సేన చిత్తుగా ఓడించడం ఖాయమని చెబుతున్నారు. ఈ తరుణంలో భారత అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. టీమిండియా-బంగ్లాదేశ్ మ్యాచ్ జరగడం అనుమానంగా మారింది. ఆఫ్ఘాన్​ను మట్టికరిపించిన మెన్ ఇన్ బ్లూ.. సూపర్-8లో భాగంగా తమ రెండో మ్యాచ్​లో బంగ్లాను ఢీకొట్టనుంది. అంటిగ్వా వేదికగా జూన్ 22న ఈ మ్యాచ్ జరగనుంది. ఇందులో నెగ్గి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోవాలని టీమిండియా వ్యూహాలు రచిస్తోంది.

బంగ్లాదేశ్ కూడా మన జట్టుకు షాక్ ఇచ్చి నాకౌట్ ఛాన్సుల్ని సజీవంగా ఉంచుకోవాలని చూస్తోంది. అయితే ఈ మ్యాచ్​కు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్-బంగ్లా మ్యాచ్​కు ఆతిథ్యం ఇస్తున్న అంటిగ్వాలో శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే ఛాన్స్ ఉందని అక్కడి వాతావరణ శాఖ చెబుతోంది. అంటిగ్వాలో వాన పడేందుకు 40 శాతం అవకాశాలు ఉన్నాయని వెదర్ వెబ్​సైట్స్ అంటున్నాయి. మ్యాచ్ జరిగే రోజు ఉదయం నుంచే తేలికపాటి జల్లులు కురిసే ఛాన్స్ ఉందని చెబుతున్నాయి. అక్కడి కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ పొద్దున 10.30 గంటలకు మొదలవనుంది. దీంతో మ్యాచ్​ జరిగే ఛాన్సులు తక్కువగా ఉన్నాయి. ఒకవేళ భారత్-బంగ్లా మ్యాచ్ రద్దయితే ఇరు టీమ్స్​కు చెరో పాయింట్ లభిస్తుంది. అప్పుడు లాస్ట్ మ్యాచ్​లో ఆస్ట్రేలియా మీద తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది తెలిసిన ఫ్యాన్స్ ఇదేం కర్మరా బాబు అంటున్నారు. బంగ్లాతో మ్యాచ్​లో భారత్ ఈజీగా నెగ్గుతుందని, సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ అవుతుందని అంటున్నారు. వరుణుడు మ్యాచ్​కు ఆటంకం కలిగించొద్దని కోరుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి