iDreamPost

ఆ SRH ప్లేయర్ పక్కా ఇండియాకు ఆడతాడు.. మార్క్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published May 15, 2024 | 6:23 PMUpdated May 15, 2024 | 6:23 PM

సన్​రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ ఓ ఆటగాడిపై ప్రశంసల జల్లులు కురిపించాడు. ఎస్​ఆర్​హెచ్​లోని ఆ ప్లేయర్ పక్కా ఇండియాకు ఆడతాడని అన్నాడు.

సన్​రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ ఓ ఆటగాడిపై ప్రశంసల జల్లులు కురిపించాడు. ఎస్​ఆర్​హెచ్​లోని ఆ ప్లేయర్ పక్కా ఇండియాకు ఆడతాడని అన్నాడు.

  • Published May 15, 2024 | 6:23 PMUpdated May 15, 2024 | 6:23 PM
ఆ SRH ప్లేయర్ పక్కా ఇండియాకు ఆడతాడు.. మార్క్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

గత కొన్ని సీజన్లుగా చెత్తాటతో అందరికీ విసుగు తెప్పించింది సన్​రైజర్స్ హైదరాబాద్. వరుస సీజన్లలో ఫెయిలవడంతో అన్ని వైపుల నుంచి విమర్శలు మూటగట్టుకుంది. దీంతో సొంత అభిమానుల నుంచి కూడా మద్దతు కరువైంది. కానీ ఒక్క సీజన్ గ్యాప్​లో అంతా మారిపోయింది. ఐపీఎల్-2024లో అద్భుతమైన ఆటతీరుతో అలరిస్తోంది ఆరెంజ్ ఆర్మీ. 250 ప్లస్ స్కోర్లను కూడా అవలీలగా బాదేస్తూ అపోజిషన్ టీమ్స్​ను వణికిస్తోంది. ప్లేఆఫ్స్ క్వాలిఫికేషన్​కు ఇంకో అడుగు దూరంలో నిలిచిన ఎస్​ఆర్​హెచ్ ఇంత సక్సెస్ అవడానికి టీమ్​లోని సీనియర్లతో పాటు పలువురు కుర్ర ప్లేయర్లు కూడా కారణమని చెప్పాలి. వారిలోని ఒకరి గురించి ఎయిడెన్ మార్క్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

సన్​రైజర్స్ యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మను ప్రశంసల్లో ముంచెత్తాడు జట్టు మాజీ సారథి మార్క్రమ్. అతడు సూపర్ టాలెంటెడ్ అని మెచ్చుకున్నాడు. అభిషేక్​ త్వరలో టీమిండియాకు ఆడతాడని జోస్యం పలికాడు. ఎంతటి బాధ్యతను అప్పగించినా దాన్ని స్వీకరించడానికి అతడు సిద్ధంగా ఉంటాడని అన్నాడు. ‘ఈ సీజన్​లో అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడుతున్నాడు. జట్టు విజయాల్లో కీలకంగా మారాడు. అతడు చాలా కామ్​గా, కూల్​గా ఉంటాడు. ఎంతటి బాధ్యతను మోయడానికైనా అతడి భుజాలు రెడీగా ఉంటాయి. అతడు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి వెళ్తాడు’ అని మార్క్రమ్ చెప్పుకొచ్చాడు.

ఈ సీజన్​లో వివాదాస్పదంగా మారిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ మీద కూడా మార్క్రమ్ రియాక్ట్ అయ్యాడు. ఈ రూల్​లో తప్పేమీ లేదని.. దీన్ని సరిగ్గా వినియోగించుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయని తెలిపాడు. టీమ్ బ్యాటింగ్ యూనిట్​లో ఎక్స్​ట్రా బ్యాటర్ ఉంటే చాలా స్వేచ్ఛగా బ్యాట్​ను ఝళిపించొచ్చని అభిప్రాయపడ్డాడు మార్క్రమ్. ఇంపాక్ట్ రూల్ వల్ల అదనంగా మరో బ్యాటర్​ను తీసుకునే అవకాశం ఉంటుందని, కాబట్టి ఔటైనా ఎక్స్ట్​ట్రా బ్యాటర్ ఉన్నాడనే ఉద్దేశంతో ఓపెనర్లు ఫస్ట్ బాల్ నుంచి హిట్టింగ్​కు దిగుతున్నారని పేర్కొన్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌‌ నిబంధన వల్ల టీ20 క్రికెట్ మరింత ఎంటర్​టైనింగ్​గా మారిందని వ్యాఖ్యానించాడు. ఐపీఎల్​లో ఇది ఊహించని మార్పులు తీసుకొచ్చిందని వివరించాడు. మరి.. అభిషేక్ శర్మ భారత్​కు ఆడతాడంటూ మార్క్రమ్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి