iDreamPost

రాత్రంతా AC ఆన్‌లో పెట్టి నిద్రపోతున్నారా? అయితే డేంజర్

  • Published Apr 29, 2024 | 5:38 PMUpdated Apr 29, 2024 | 5:38 PM

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసిన విపరీతమైన ఎండలు మండిపడుతున్నాయి. ఇక తీవ్రమైన ఎండలు, వేడి గాలులు, ఉక్కపోతలకు ప్రజలు సతమతమవుతున్నారు. ముఖ్యంగా.. ఉదయం కంటే రాత్రి ఉష్ణోగ్రతలు అనేవి సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఈ వేడికి తట్టుకోలేక చాలామంది రాత్రంతా ఏసీలు వేసుకొని నిద్రపోతారు. కానీ, అలా చేయడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి రోజూ ఏసీలో నిద్రించడం వల్ల శరీరంపై ఎలాంటి హాని కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసిన విపరీతమైన ఎండలు మండిపడుతున్నాయి. ఇక తీవ్రమైన ఎండలు, వేడి గాలులు, ఉక్కపోతలకు ప్రజలు సతమతమవుతున్నారు. ముఖ్యంగా.. ఉదయం కంటే రాత్రి ఉష్ణోగ్రతలు అనేవి సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఈ వేడికి తట్టుకోలేక చాలామంది రాత్రంతా ఏసీలు వేసుకొని నిద్రపోతారు. కానీ, అలా చేయడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి రోజూ ఏసీలో నిద్రించడం వల్ల శరీరంపై ఎలాంటి హాని కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Apr 29, 2024 | 5:38 PMUpdated Apr 29, 2024 | 5:38 PM
రాత్రంతా AC ఆన్‌లో పెట్టి నిద్రపోతున్నారా? అయితే డేంజర్

ప్రస్తుతం ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా విధంగా ఎండలు విపరీతంగా దంచికొడుతున్నాయి.అసలు ఉదయం 7 గంటలకే మధ్యహ్న సమయంలో ఉన్నంత ఏండా కాసేస్తుంది. ఇక పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలతో భానుడు తన ప్రతాపంను చూపటం మొదలుపెడుతున్నాడు. దీంతో భగ భగ మంటూ ఎండలు మండిపడటంతో.. ప్రజలు బయటకు వెళ్లలంటేనే భయపడుతున్నారు.ఇక మధ్యాహ్నం వేళలో అయితే ఈ ఏండలు వాళ్ల రోడ్లు చాలా నిర్మాన్యుష్యంగా మారుతున్నాయి. అయితే ఈ తీవ్రమైన ఎండలు, ఉక్కపోతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక వీటి నుంచి ఉపశమనం పొందేందుకు చాలామంది కూలర్లు, ఏసీల వెంట పరుగులు పెడుతున్నారు. అయితే  ఇలా ఏసీలలో చల్లని ప్రదేశాల్లో నిద్రపోతే, అది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి రోజూ ఏసీలో నిద్రించడం వల్ల శరీరంపై ఎలాంటి హాని కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసిన విపరీతమైన ఎండలు మండిపడుతున్నాయి. ఇక తీవ్రమైన ఎండలు, వేడి గాలులు, ఉక్కపోతలకు ప్రజలు సతమతమవుతున్నారు. ముఖ్యంగా.. ఉదయం కంటే రాత్రి ఉష్ణోగ్రతలు అనేవి సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఈ వేడికి తట్టుకోలేక చాలామంది రాత్రంతా ఏసీలు వేసుకొని నిద్రపోతారు. కానీ, అలా చేయడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా, రాత్రి 5 నుంచి 6 గంటలపాటు ఈ ఏసీ వేసుకుని నిద్రపోతే, అది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

అయితే రాత్రంతా ఏసీ పెట్టుకుని పడుకోవడం వలన ఉదయం పూట శరీరం చాలా వేడిగా ఉంటుందట. అలాగే ఈ ఏసీ వల్ల ఉదయానికి శరీరం బిగుసుకుపోయినట్టుగా మారి ఒంటి నొప్పిని కలిగిస్తుంది. కనుక ప్రతి రోజూ మీరు ఏసీలో ఎక్కువ సమయం నిద్రిస్తున్నట్టయితే.. మీ ఎముకలపై కూడా ప్రభావం ఉంటుంది. అంతేకాకుండా.. ఈ ఏసీ వలన అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేని స్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఏసీలో ఎక్కువ సమయం నిద్రించేవారిలో శ్వాస తీసుకోవడంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.  తద్వారా దగ్గు, ఛాతీ నొప్పి, ముక్కు కారటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.

అంతేకాకుండా.. ఏసీ ఉష్ణోగ్రతను తగ్గించడమే కాకుండా గదిలో ఉండే తేమను కూడా తగ్గిస్తుంది. దీని కారణంగా ప్రతిరోజూ ACలో నిద్రించడం వల్ల చర్మం పొడిబారటం, కంటి అలెర్జీలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే దురద, మచ్చలు వంటి సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి, మీరు మీ చర్మాన్ని, కళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటే.. ఏసీని తక్కువ సమయం పాటు వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పైగా రాత్రిపూట గది ఉష్ణోగ్రత చల్లబడేవరకు ఏసీ ఆన్‌ చేసి పెట్టుకోవాలని, ఆ తర్వాత.. ఏసీని ఆఫ్ చేసి ఫ్యాన్‌ ఆన్‌ చేసి పెట్టుకోవటం మంచిదని సూచిస్తున్నారు. ఎందుకంటే.. ఇలా ఎక్కువ సమయం ఏసీలో ఉండడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీనితో పాటు రక్తనాళాలు కుంచించుకుపోతాయి. ఇకపోతే ఏసీలోని దుమ్ము, ధూళి ముక్కు, నోటి ద్వారా చేరి అలర్జిక్ రైనైటిస్ వంటి సమస్యలను కలిగిస్తుంది. కనుక, రాత్రిపూట మూడు నాలుగు గంటలపాటు మాత్రమే ఎయిర్ కండీషనర్‌ని ఆన్ చేసి ఉంచుకోవడం ఆరోగ్యనికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరి, రాత్రి వేళలో ఎక్కువ సమయం ఏసీ ఆన్ చేసి ఉంచడం వల్ల వచ్చే ఆనారోగ్య సమస్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి