iDreamPost

షణ్ముఖ్ కేసులో సంచలన ట్విస్ట్! కన్న తండ్రే పట్టించాడా?

  • Published Feb 22, 2024 | 5:50 PMUpdated Feb 22, 2024 | 5:50 PM

తాజాగా యూట్యూబ్ ఫేమస్ స్టార్ అయినా షణ్ముఖ్ జెస్వంత్ గంజాయి కేసులో అరెస్ట్ అయిన వార్తలు విన్నాము. అయితే, ఈ కేసును విచారిస్తున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించిన మరో ఆసక్తి కర వార్త వెలుగులోకి వచ్చింది.

తాజాగా యూట్యూబ్ ఫేమస్ స్టార్ అయినా షణ్ముఖ్ జెస్వంత్ గంజాయి కేసులో అరెస్ట్ అయిన వార్తలు విన్నాము. అయితే, ఈ కేసును విచారిస్తున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించిన మరో ఆసక్తి కర వార్త వెలుగులోకి వచ్చింది.

  • Published Feb 22, 2024 | 5:50 PMUpdated Feb 22, 2024 | 5:50 PM
షణ్ముఖ్ కేసులో సంచలన ట్విస్ట్! కన్న తండ్రే పట్టించాడా?

యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ తో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు షణ్ముఖ్ జెస్వంత్. ముఖ్యంగా యూత్ లో ఇతనికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ తర్వాత బిగ్ బాస్ లో బుల్లితెర ఆడియన్సుకు సుపరిచితుడయ్యి.. మంచి ఫేమ్ అండ్ నేమ్ ను సంపాదించుకున్నాడు. అటు సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టీవ్ గానే ఉంటూ ఉంటాడు ఈ షార్ట్ ఫిల్మ్ హీరో. అయితే, తాజాగా షణ్ముఖ్ , అతని తమ్ముడు సంపత్ గంజాయి కేసులో పట్టుపడి.. పోలీసులకు చిక్కారు. దీనితో ఇప్పటివరకు వీరిపై విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ కేసును విచారిస్తున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఈ కేసుకు సంబంధిచిన మరో విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. షణ్ముఖ్ తండ్రే వారిని పట్టించారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కొంతకాలం క్రిందట ఓ డాక్టర్ యువతితో స్నేహం చేసిన షణ్ముఖ్.. తన షార్ట్ ఫిలిమ్స్ లో అవకాశం ఇప్పిస్తానని చెప్పాడు. ఈ క్రమంలోనే వారి మధ్య ఉన్న స్నేహం కారణంగా .. ఆ యువతిని తన తమ్ముడు సంపత్ కు కూడా పరిచయం చేసాడు. ఆ తర్వాత సంపత్ కు ఆ డాక్టర్ యువతికి మధ్య ఉన్న స్నేహం .. ప్రేమగా మారింది. గత పదేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ.. వారి ఇంట్లోని వారిని కూడా ఒప్పించి వివాహం చేసుకోడానికి సిద్ధం అయ్యారు. ఈ క్రమంలోనే ఇరు కుటుంబాల ఒప్పందంతో .. వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే, ఆ తర్వాత ఆ యువతి తల్లికి ఆరోగ్యం బావుండకపోవడంతో.. వారి వివాహం వాయిదా పడుతూ వచ్చింది. దింతో సంపత్ మరో యువతిని పెళ్లి చేసుకోడానికీ సిద్ధం అయ్యాడట.

అయితే, ఈ విషయాన్నీ స్వయంగా షణ్ముఖ్ తండ్రి అప్పారావు .. ఆ యువతికి తెలియజేయడంతో.. ఆ యువతి సంపత్ పై కేసు పెట్టింది. ఆ యువతి నార్సింగ్ పోలీసులకు విషయాన్నీ తెలియజేయడంతో.. పోలీసులు సంపత్ ఫ్లాట్ కు వెళ్లారు. ఆ సమయంలో అదే ఫ్లాట్ లో సంపత్ తో పాటు.. షణ్ముఖ్ కూడా ఉన్నాడు. ఈ క్రమంలో పోలీసులు వారి ఫ్లాట్ ను తనిఖీ చేసే ప్రాసెస్ లో అక్కడ గంజాయి దొరికింది. దీనితో వెంటనే షణ్ముఖ్, సంపత్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు విషయంలో విచారణ కొనసాగిస్తున్నారు. గతంలో కూడా షణ్ముఖ్ కార్ డ్రైవింగ్ కేసులో ఓ సారి వైరల్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు మరోసారి ఈ కేసులు ఇన్వాల్స్ అయ్యారు. పరోక్షంగా షణ్ముఖ్ తండ్రి వారిని పట్టించాడా అనే వార్తలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి , ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి