iDreamPost

పెళ్లైన 5 ఏళ్లకు ట్విన్స్ కు జన్మనిచ్చిన బుల్లితెర నటి! పోస్ట్ వైరల్

  • Author Soma Sekhar Published - 07:10 PM, Wed - 26 July 23
  • Author Soma Sekhar Published - 07:10 PM, Wed - 26 July 23
పెళ్లైన 5 ఏళ్లకు ట్విన్స్ కు జన్మనిచ్చిన బుల్లితెర నటి! పోస్ట్ వైరల్

అమ్మతనం.. పెళ్లైన ప్రతీ స్త్రీ కోరుకునే అద్భుతమైన అనుభూతి. ఇక అమ్మతనంతోనే స్త్రీ జీవితానికి పరిపూర్ణత లభిస్తుందని కొందరు భావిస్తుంటారు. అయితే ఆ పరిపూర్ణతను అందుకోలేక కొందరు బాధపడుతూ ఉంటారు. పెళ్లైన కొన్ని సంవత్సరాల వరకు పిల్లలు పుట్టకపోవడంతో.. వారు తీవ్ర మనోవేదనకు గురౌతూ ఉంటారు. తాజాగా తన మనోవేదన 5 ఏళ్ల తర్వాత తీరిందని చెప్పుకొచ్చింది బుల్లితెర నటి. ఈ నెల 25న తాను ట్విన్స్ కు జన్మనిచ్చినట్లు ఈ బ్యూటీ ఇన్ స్టా వేదికగా వెల్లడించింది.

పంకురీ అవస్తీ.. రజియా సుల్తాన్ అనే బాలీవుడ్ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఈ సీరియల్ తెచ్చిన క్రేజ్ ద్వారా వరుసగా సుర్యపుత్ర, కరణ్, మేడమ్ సార్, యే రిస్తా క్యా కహ్లాతా లాంటి సీరియల్స్ లో నటించింది. కాగా.. సూర్యపుత్ర కరణ్ టీవీ సీరియల్లో నటించిన గౌతమ్ ను 2018లో లవ్ మ్యారేజ్ చేసుకుంది పంకురీ అవస్తీ. ఐదేళ్ల తర్వాత ఈ దంపతులకు ట్విన్స్ జన్మించారు. ఈనెల 25న పంకురీ అవస్తీ ఓ బాబుకు, ఓ పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ఇన్ స్టాలో తన ఆనందాన్ని ఈ విధంగా పంచుకొచ్చింది.

“సంతోషంతో నిండిన రెండు మనసులు ఇప్పుడు నలుగురిగా ప్రయాణం సాగించబోతున్నాయి. ఈ విషయాన్ని ఎంతో ఆనందంతో ప్రకటిస్తున్నాను. మా పట్ల మీ అందరి ప్రేమకు, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు” అంటూ పంకురీ రాసుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ చూసిన పలువురు సినీ నటులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సూర్యపుత్ర కరణ్ సీరియల్లో నటించే క్రమంలో పంకురీ-గౌతమ్ మధ్య ప్రేమ చిగురించింది. దాంతో కొన్ని నెలల పాటు వీరు డేటింగ్ లో ఉన్నారు. ఆ తర్వాత 2018 ఫిబ్రవరిలో రాజస్థాన్ లోని అల్వార్ తిజారా ఫోర్ట్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Pankhuri Awasthy Rode (@pankhuri313)

 

View this post on Instagram

 

A post shared by Gautam Rode (@rodegautam)


ఇదికూడా చదవండి: కామాంధుడి వేధింపులను తట్టుకోలేక ఇంటి ఓనర్ ఆత్మహత్య!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి