iDreamPost

కస్టమర్లకు శుభవార్త చెప్పిన SBI

కస్టమర్లకు శుభవార్త చెప్పిన SBI

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు కొత్త కొత్త ఆఫర్లు ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది. అయితే తాజా కూడా SBI కస్టమర్లకు మరో అదిరిపోయే ఆఫర్ ను అందించింది. ఫెస్టివల్ సీజన్ లో భాగంగా కొత్తగా కారు కొనాలనుకునే శుభవార్త చెప్పింది. కస్టమర్ల లోన్లపై తాజాగా ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వార్త తెలియడంతో కొందరు ఖాతాదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆఫర్ 2024, జనవరి 31 వరకు కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని SBI ప్రకటనలో తెలిపింది.

ఇంతే కాకుండా హౌస్ లోన్లపై అందిస్తున్న రాయితీని కూడా పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరో విషయం ఏంటంటే? రానున్న పండగల నేపథ్యంలోనే SBI ఈ ఆఫర్ ను కస్టమర్ల ముందు ఉంచిందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఏదేమైనా కొత్తగా కారు కొనాలనే కస్టమర్లకు ఇది మంచి సదవకాశమని చెబుతున్నారు. SBI తాజాగా తీసుకొచ్చిన ఈ ఆఫర్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి