iDreamPost

సంజూ శాంసన్ మరో తుఫాన్ ఇన్నింగ్స్.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్!

  • Author singhj Published - 05:54 PM, Wed - 25 October 23

ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్​కు తనను సెలక్ట్ చేయలేదన్న కోపంలో ఉన్న టీమిండియా బ్యాటర్ సంజూ శాంసన్ కసితో ఆడుతున్నాడు. వరుసగా ధనాధన్ ఇన్నింగ్స్​లతో అదరగొడుతున్నాడు.

ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్​కు తనను సెలక్ట్ చేయలేదన్న కోపంలో ఉన్న టీమిండియా బ్యాటర్ సంజూ శాంసన్ కసితో ఆడుతున్నాడు. వరుసగా ధనాధన్ ఇన్నింగ్స్​లతో అదరగొడుతున్నాడు.

  • Author singhj Published - 05:54 PM, Wed - 25 October 23
సంజూ శాంసన్ మరో తుఫాన్ ఇన్నింగ్స్.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్!

భారత క్రికెట్ టీమ్​లోకి అడుగు పెట్టేందుకు ఎంతో మంది క్రికెటర్లు ఎదురు చూస్తున్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు.. జట్టులో సెటిలైపోదామని తహతహలాడుతున్నారు. అయితే కొందరు ప్లేయర్లకు ఎన్ని అవకాశాలు ఇచ్చిన టీమ్​లో కుదురుకోవడం లేదు. టీమ్ మేనేజ్​మెంట్ వారిపై నమ్మకం ఉంచి వరుసగా ఛాన్సులు ఇస్తున్న తమ సత్తాను ప్రూవ్ చేసుకోవడం లేదు. డొమెస్టిక్, ఐపీఎల్ లెవల్లో రాణిస్తున్న క్రికెటర్స్ తీరా ఇంటర్నేషనల్ మ్యాచులకు వచ్చే సరికి అదే లెవల్లో పెర్ఫార్మ్ చేయలేకపోతున్నారు. కొందరికి టీమ్ మేనేజ్​మెంట్ వరుస ఛాన్సులు ఇస్తుంటే.. మరికొందరి విషయంలో మాత్రం పక్షపాతంతో వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి.

యంగ్ బ్యాటర్ సంజూ శాంసన్ విషయంలో సెలెక్టర్లు, భారత టీమ్ మేనేజ్​మెంట్ పక్షపాతంగా వ్యవహరించిందనే విమర్శలు చాలాసార్లు వచ్చాయి. అందుకు కారణం ఈ కేరళ బ్యాట్స్​మన్​కు ఎక్కువ అవకాశాలు ఇవ్వకపోవడమేనని అనొచ్చు. అప్పుడెప్పుడో 2015లో ఇంటర్నేషనల్ క్రికెట్​లో ఎంట్రీ ఇచ్చిన సంజూ.. ఐసీసీ టోర్నీల్లో ఇప్పదాకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. టీమిండియాలో అతడు పర్మినెంట్ మెంబర్ కాలేకపోయాడు. ఇటీవల జరిగిన ఆసియా కప్​తో పాటు వన్డే వరల్డ్ కప్​ టీమ్​లోనూ సంజూక్ చోటు దక్కలేదు. సంజూకు అన్యాయం జరిగిందని అతడి ఫ్యాన్స్​తో పాటు కొందరు సీనియర్లు కూడా కామెంట్స్ నెట్టింట కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

సంజూ విషయంలో భారత సెలెక్టర్లు, టీమ్ మేనేజ్​మెంట్ పూర్తి తప్పని చెప్పలేం. ఎందుకంటే తీవ్ర పోటీ ఉన్న టీమిండియాలో ఒక ప్లేయర్​కు వరుసగా అవకాశాలు ఇవ్వలేని పరిస్థితి. సంజూ కూడా తనకు వచ్చిన కొన్ని ఛాన్సులను పూర్తిగా సద్వినియోగం చేసుకొని కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ నమ్మకాన్ని గెలుచుకొని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో! ఇక, తనను వరల్డ్ కప్ టీమ్​కు సెలెక్ట్ చేయకపోవడంపై సీరియస్​గా ఉన్న సంజూ.. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్​లో బ్యాట్​తో అదరగొడుతున్నాడు.

ఇటీవల చండీగఢ్​తో జరిగిన మ్యాచ్​లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న సంజూ (32 బంతుల్లో 52).. తాజాగా ఒడిశాతో మ్యాచ్​లోనూ మరోమారు ఫిఫ్టీ రన్స్ బాదాడు. ఈసారి 31 బంతుల్లోనే ఏకంగా 55 రన్స్ చేశాడు. అతడితో పాటు వరుణ్​ నాయనార్ (48), విష్ణు వినోద్ (35) రాణించడంతో 20 ఓవర్లలో కేరళ 183 రన్స్ చేసింది. అయితే ఛేజింగ్​లో ఒడిశా 133 రన్స్​కే ఆలౌట్ అయింది. వరుసగా ధనాధన్ ఇన్నింగ్స్​లతో ఆకట్టుకుంటున్న సంజూ శాంసన్​ను ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు. అతడు మాస్ హిట్టింగ్​తో సెలెక్టర్లకు వార్నింగ్ పంపాడని అంటున్నారు. మరి.. సంజూ బ్యాటింగ్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ద్రవిడ్​కో న్యాయం.. ప్లేయర్లకో న్యాయమా? BCCI తీరుపై నెటిజన్స్ ఫైర్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి