iDreamPost

తెలంగాణలో దారుణం.. భార్యను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న భర్త!

తెలంగాణలో దారుణం.. భార్యను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న భర్త!

ఈ రోజుల్లో కొందరు భార్యాభర్తలు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ వాగ్వాదానికి దిగుతున్నారు. ఇక అవే గొడవలు మితిమీరడంతో చివరికి విడాకుల వరకు దారి తీస్తున్నాయి. ఈ మధ్య కాలంలో జరుగుతున్నవి కూడా ఇలాంటి ఘటనలే. ఇదిలా ఉంటే.. ఓ భార్యాభర్తలు గొడవ పడ్డారు. ఇక క్షణికావేశంలో భర్త భార్యను హత్య చేశాడు. ఆ తర్వాత భయంతో ఏం చేయాలో తెలియక తాను కూడా ఆత్యహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలోని వీకర్ సెక్షన్స్ కాలనీలో యాదగిరి-యశోద దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. అప్పటి నుంచి ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా కాపురాన్ని కొనసాగించారు. ఇకపోతే కుటుంబ కలహాల వల్ల ఈ దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఈ దంపతులు తరుచుగా వాగ్వాదానికి దిగేవారు. ఈ క్రమంలోనే శనివారం రోజు కూడా ఈ భార్యాభర్తలు గొడప పడ్డారు. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. క్షణికావేశంలో ఊగిపోయిన భర్త యాదగిరి భార్యను అతి దారుణంగా హత్య చేశాడు.

భార్య చనిపోయిందని తెలుసుకున్న అతనికి ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక చేసేదేం లేక భయంతో అదే ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్యహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ గురై కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దంపతుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

ఇది కూడా చదవండి: భర్తకు రోజూ నైట్ షిఫ్ట్స్.. భార్య చేసిన పనికి షాకైన భర్త!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి